త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | గ్రామ పంచాయ‌తీల‌కు గుడ్‌న్యూస్‌.. రూ.2500 కోట్లు విడుద‌ల చేయ‌నున్న‌ కేంద్రం

Telangana | రాష్ట్రంలో (Telangana) నిధుల లేమితో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయ‌తీల‌కు (Grama Panchayathi) కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న‌ 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను (Finance Commission Funds) విడుద‌ల చేసేందుకు ఒప్పుకున్న‌ది.

G

Telangana | Published On Jan 14, 2026, 11.40 am IST

Telangana | గ్రామ పంచాయ‌తీల‌కు గుడ్‌న్యూస్‌.. రూ.2500 కోట్లు విడుద‌ల చేయ‌నున్న‌ కేంద్రం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్రంలో (Telangana) నిధుల లేమితో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయ‌తీల‌కు (Grama Panchayathi) కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న‌ 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను (Finance Commission Funds) విడుద‌ల చేసేందుకు ఒప్పుకున్న‌ది. రాష్ట్రంలోని గ్రామ‌పంచాయ‌తీల పాల‌క‌వ‌ర్గాలకు 2024 జ‌న‌వ‌రిలో గ‌డువు ముగిసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ స‌ర్కార్ స‌మయానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో అప్ప‌టి నుంచి ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌లో ఉన్నాయి. పాల‌కవ‌ర్గాలు లేక‌పోవ‌డంతో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అయితే గ‌త డిసెంబ‌ర్ రాష్ట్రంలోని గ్రామ పంచాయ‌తీల‌కు రేవంత్ స‌ర్కార్ ఎన్నిక‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. పెండింగ్‌లో ఉన్న రూ.2500 కోట్ల‌ను విడుద‌ల చేసేందుకు ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా ఈ నెలాఖ‌రులోగా రూ.వెయ్యి కోట్లను విడుదల చేయ‌డానికి అంగీకరించింది. మిగిలిన రూ.1500 కోట్లను ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీనికి సంబంధించి విధివిధానాల‌ను ప్ర‌క‌టించింది. అవి పూర్త‌యిన త‌ర్వాతే ఈ నిధుల‌ను పంచాయ‌తీలు వాడుకునే అవ‌కాశం ఉంది.

15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని పేర్కొంది. ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్​మెంట్ సిస్టమ్​ పోర్టల్​లో నమోదు చేసి యూనిక్​ ఏజెన్సీ కోడ్​ పొందాల‌ని, ఈ-గ్రామ్​ స్వరాజ్ పోర్టల్​లోనూ ఖాతాల వివరాలను నమోదు చేయాలని స్ప‌ష్టం చేసింది.
నిధుల వినియోగానికి సర్పంచి (చెకర్​), ఉప సర్పంచి (మేకర్​) డిజిటల్ సంతకాలను నమోదు చేసి సంబంధిత ఎంపీడీవోల ద్వారా ఆమోదం పొందాల‌ని తెలిపింది. ఈ ప్రక్రియకు క్లాస్​-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసర‌ని పేర్కొంది. సైనింగ్​, ఎన్​క్రిప్షన్​ సౌకర్యంతో పాటు యూఎస్​బీ టోకెన్​ కూడా ఉండాలని వెల్ల‌డించింది. అవసరమైన డిజిటల్ సంతకాలను పంచాయతీ అధికారులు జీఈఎం పోర్టల్‌లో నమోదు చేయాలి సూచించింది. పనులను ఈ-ప్రొక్యూర్​మెంట్​ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా నిర్వహించాలని అందులో పేర్కొంది.

పాల‌క‌వ‌ర్గాలు లేక‌పోవ‌డంతో కేంద్రం నుంచి నిధులు రాక‌పోవ‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వం డ‌బ్బులు ఇవ్వ‌డంలో అల‌స‌త్వం వ‌హించ‌డంతో గ‌త రెండేండ్లుగా గ్రామాల్లో ప‌రిపాల‌న స్తంభించిపోయింది. పంచాయ‌తీ సిబ్బందికి జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తమైంది. పంచాయతీ ట్రాక్టర్​లో డీజిల్​ కూడా పోయలేని దుస్థితి త‌లెత్తింది. పంచాయ‌తీ కార్య‌క‌ద‌ర్శులు అప్పులు చేసి మ‌రీ గ్రామాల్లో అర‌కొరగా ప‌నులు నిర్వ‌హించారు. తాజాగా పాల‌క‌వ‌ర్గాలు కొలువుదీర‌డం, నిధులు విడుదలకు కేంద్రం స‌రేన‌న‌డంతో కాస్త ఉపశమనం లభించిన‌ట్ల‌యింది.

Advertisement

తాజావార్తలు

Advertisement