Komatireddy Venkat Reddy | మరో 20 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy | మరో 20 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.
Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : మరో 20 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీలో సుమారు రూ. 25 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పాలమూరు గడ్డ బిడ్డనే. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలను వెనుకబాటు జిల్లాలు అని అంటారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో నరకయాతన అనుభవిస్తే.. పాలమూరు జిల్లా కరువుతో వెనుబడింది. ఈ వెనుకబడిన జిల్లాలను బంగారు జిల్లాలుగా మార్చే ప్రయత్నంలో సీఎం రేవంత్ ఉన్నారు అని మంత్రి తెలిపారు.
ఇప్పటికే కురుమూర్తి ఆలయానికి రూ.140 కోట్లతో ఘాట్ రోడ్డు మంజూరు చేశాం. దేవరకద్ర నియోజకవర్గంలో రూ.60 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేస్తున్నాం. దేవరకద్ర నియోజకవర్గం బంగారంగా మారాలంటే.. ప్రజలందరూ స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండాలి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి చేసిన... 10 శాతం పనులు పూర్తి చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం ఎలా పూర్తవుతుంది.? ఇంకా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు.? సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో ఏ ఒక్క రోజు విరామం తీసుకోకుండా పని చేస్తున్నారు. కేసీఆర్ సంవత్సరంలో ఎప్పుడో ఒక్కరోజు కనబడుతారు... రేవంత్ రెడ్డి రోజు ప్రజలకు కనపడతారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



