Chanagani Dayakar | కేటీఆర్ అక్రమాస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలి: చనగాని దయాకర్
Chanagani Dayakar | కేటీఆర్ (KTR) సంపాదించిన అక్రమాస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) డిమాండ్ చేశారు. కేసీఆర్ (KCR) దత్తత గ్రామం వాసాల మర్రి అభివృద్ధిపై కేటీఆర్ (KTR) చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: కేటీఆర్ (KTR) సంపాదించిన అక్రమాస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) డిమాండ్ చేశారు. కేసీఆర్ (KCR) దత్తత గ్రామం వాసాల మర్రి అభివృద్ధిపై కేటీఆర్ (KTR) చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. గాంధీభవన్ (Gandhi Bhavan) లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దయాకర్ మాట్లాడుతూ 2020లో కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 205 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతుల గోసను పట్టించుకోలేదని మండిపడ్డారు. కేటీఆర్కు దమ్ముంటే తన ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2009 నుంచి 2023 వరకు కేటీఆర్ ఆస్తులు ఎంత పెరిగాయో తెలంగాణ సమాజానికి చెప్పాలని సూచించారు. ఆస్తుల్లో భారీ పెరుగుదలకు కారణాలేమిలో వివరించాలని అన్నారు. 2009, 2023 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లు బహిరంగ పరచి, చర్చకు రావాలని సవాల్ చేశారు. 2009లో రూ.నాలుగు కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తులు 2023 నాటికి రూ.53 కోట్లకు ఎలా చేరాయని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతో కేటీఆర్ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ జైలుకు వెళ్లాలనే తన కోరిక నెరవేరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో వినాశనం చేసి, అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కళ్లు, చెవులు ఉండి కూడా చూడలేని, వినలేని అసమర్థ ప్రతిపక్షాలు ఉన్నాయని దుయ్యబట్టారు.
సంబంధిత వార్తలు

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



