త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Journalists | జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ స్కీం కల్పించాలి

Journalists | రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ స్కీం కల్పించాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుకు టీడ‌బ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే ప్ర‌తినిధులు విన‌తిప‌త్రం అందించారు.

S

Telangana | Published On Mar 12, 2026, 5.13 pm IST

Journalists | జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ స్కీం కల్పించాలి
Advertisement

Journalists | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ స్కీం కల్పించాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుకు టీడ‌బ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే ప్ర‌తినిధులు విన‌తిప‌త్రం అందించారు. ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి పాలసీ పరంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అదే సందర్భంగా హెచ్‌యూజే 2026 డైరీని సీఎస్‌కు హెచ్‌యూజే అధ్య‌క్షులు అరుణ్ కుమార్ అంద‌జేశారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో టీడ‌బ్ల్యూజేఎఫ్‌ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు బి. జగదీశ్వర్, గండ్ర నవీన్, బి. దామోదర్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు క్రాంతి తదితరులు హాజరయ్యారు.

Advertisement
Advertisement