త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ‘గిరిజ‌నుల ఆత్మబంధువు’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన కేటీఆర్

KTR | బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో ఆవిష్క‌రించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ అందించిన‌ సేవలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన శ్రీను నాయక్‌ను కేటీఆర్ అభినందించారు.

S

Telangana | Published On Dec 6, 2025, 3.35 pm IST

KTR | ‘గిరిజ‌నుల ఆత్మబంధువు’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన కేటీఆర్
Advertisement

KTR | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో ఆవిష్క‌రించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ అందించిన‌ సేవలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన శ్రీను నాయక్‌ను కేటీఆర్ అభినందించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ క‌ల్పించార‌ని గుర్తు చేశారు. గిరిజనులకు పోడు భూములపై హక్కులను కల్పించే విధంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబందు పథకాన్ని అనువర్తింపజేయడం ఈ విధంగా ఎన్నో ఏండ్ల గిరిజన కలలను సాకారం చేసిన స్వాప్నికుడు కేసీఆర్ అని ఆయ‌న కొనియాడారు. కేసీఆర్ సేవ‌ల‌ను తండాలలో గూడాలలో గిరిజన జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

అదేవిధంగా గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, సీఎం ఎస్టీఈఐ పథకం, గిరి వికాస్, గిరి పోషణ, హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి వినూత్నమైన కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. గిరిజన తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసిన రోజు ఆగస్టు 2వ తేదీన‌ అన్ని గిరిజన గ్రామాలలో గిరిజన సంబురం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement