త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Party | కాంగ్రెస్‌లో చేరిన ఖ‌మ్మం కార్పొరేట‌ర్లు.. కండువా క‌ప్పిన సీఎం రేవంత్

Congress Party | క్షేత్ర‌స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌దేప‌దే ఉద్ఘాటిస్తున్న‌ప్ప‌టికీ.. ముఖ్య‌నేత‌లు మాత్రం కారు దిగిపోతున్నారు.

S

Telangana | Published On Jan 7, 2026, 3.20 pm IST

Congress Party | కాంగ్రెస్‌లో చేరిన ఖ‌మ్మం కార్పొరేట‌ర్లు.. కండువా క‌ప్పిన సీఎం రేవంత్
Advertisement

Congress Party | త్రినేత్ర‌.న్యూస్ : క్షేత్ర‌స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌దేప‌దే ఉద్ఘాటిస్తున్న‌ప్ప‌టికీ.. ముఖ్య‌నేత‌లు మాత్రం కారు దిగిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. అది కూడా కేటీఆర్ ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వేళ ముగ్గురు కార్పొరేట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు దనియాల రాధ‌, తోట ఉమారాణి, రుద్ర‌గాని శ్రీదేవి హస్తం గూటికి చేరారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కార్పొరేట‌ర్ల‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. వీరితో పాటు ఇటీవ‌ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేట‌ర్లు సీహెచ్ ల‌క్ష్మీ, జి చంద్ర‌క‌ళ‌, డి స‌ర‌స్వ‌తి, అమృత‌మ్మ‌, ఎం శ్రావ‌ణి కూడా సీఎంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement