త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Blood Donation | రైతుల కోసం రక్త‌దానం అభినంద‌నీయం.. బీఆర్ఎస్ ఎన్నారై నేత‌ నాగ‌రాజు గుర్రాల‌

Blood Donation | రైతుల కోసం ర‌క్త‌దానం (Blood Donation) చేసిన సౌత్ ఆఫ్రికా ఎన్నారై బీఆర్ఎస్ కార్య‌క‌ర్త అనీల్ రెడ్డి మిట్ట‌ప‌ల్లిని బీఆర్ఎస్ ఎన్నారై నాయ‌కులు నాగ‌రాజు గుర్రాల (Nagaraju Gurrala) అభినందించారు.

G

Telangana | Published On Jul 15, 2026, 8.56 am IST

Blood Donation | రైతుల కోసం రక్త‌దానం అభినంద‌నీయం.. బీఆర్ఎస్ ఎన్నారై నేత‌ నాగ‌రాజు గుర్రాల‌
Advertisement

Blood Donation | త్రినేత్ర‌.న్యూస్‌: రైతుల కోసం ర‌క్త‌దానం (Blood Donation) చేసిన సౌత్ ఆఫ్రికా ఎన్నారై బీఆర్ఎస్ కార్య‌క‌ర్త అనీల్ రెడ్డి మిట్ట‌ప‌ల్లిని బీఆర్ఎస్ ఎన్నారై నాయ‌కులు నాగ‌రాజు గుర్రాల (Nagaraju Gurrala) అభినందించారు. క‌న్నెప‌ల్లి పంప్‌హౌస్ నుంచి గోదావ‌రి జిలాల ఎత్తిపోత విష‌యంలో.. `వాళ్లను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది` అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ నేత‌ల‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సౌత్ ఆఫ్రికా ఎన్నారై బీఆర్‌ఎస్ కార్యకర్త అనీల్ రెడ్డి మిట్టపల్లి వేములవాడలో రైతుల పక్షాన నిలిచి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని నాగరాజు గుర్రాల అన్నారు.

రైతుల పట్ల ప్రేమను, బాధ్యతను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ రక్తదానం చేయడం సమాజానికి గొప్ప సందేశమని చెప్పారు. రైతు సంక్షేమం కోసం సేవ చేయాలనే తపనతో ముందుకు వచ్చిన అనీల్ రెడ్డి సేవాభావం ప్రశంసనీయమని కొనియాడారు. రైతుల కోసం ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement