త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Narsampet | రాత్రికిరాత్రే గ‌ద్దె కూల్చివేత‌.. న‌ర్సంపేట‌లో బీఆర్ఎస్ నేత‌ల ధ‌ర్న‌.. ఉద్రిక్త‌త‌

Narsampet | వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌లో (Narsampet) ఉద్రిక్త‌త త‌లెత్తింది. బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్ర‌హ ఏర్పాటు కోసం నిర్మించిన గ‌ద్దెను అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారుల తీరును నిర‌సిస్తూ బీఆర్ఎస్ (BRS) నేత‌లు ధ‌ర్నాకు దిగారు.

G

Telangana | Published On Aug 10, 2026, 11.19 am IST

Narsampet | రాత్రికిరాత్రే గ‌ద్దె కూల్చివేత‌.. న‌ర్సంపేట‌లో బీఆర్ఎస్ నేత‌ల ధ‌ర్న‌.. ఉద్రిక్త‌త‌
Advertisement

Narsampet | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌లో (Narsampet) ఉద్రిక్త‌త త‌లెత్తింది. బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్ర‌హ ఏర్పాటు కోసం నిర్మించిన గ‌ద్దెను అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారుల తీరును నిర‌సిస్తూ బీఆర్ఎస్ (BRS) నేత‌లు ధ‌ర్నాకు దిగారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ఇటీవ‌ల మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న విగ్ర‌హాన్ని న‌ర్సంపేట‌లోని ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ ఎదుట ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసేందుకు గ‌ద్దె నిర్మించారు. అయితే విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డానికి అనుమ‌తి లేదంటూ ఆదివారం రాత్రి అధికారులు దానిని కూల్చివేశారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు అధికారుల‌ తీరుకు నిర‌స‌న‌గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), మాజీ ఎంపీ వినోద్‌ రావు ఆధ్వర్యంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో ధ‌ర్నాకు (Dharna) దిగారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి (Congress) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. పోలీసుల‌ను బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక‌త ఏర్పాడింది. ధర్నా కారణంగా నర్సంపేట- మహబూబాబాద్, నర్సంపేట- కొత్తగూడ, నర్సంపేట- ములుగు మార్గాల్లో రాకపోకలు నిలిచి పోయాయి.

Advertisement
Advertisement