త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | ప‌సికందును చంపిన వారిని శిక్షించండి.. డీజీపీకి బీఆర్ఎస్ నేత‌ల విన‌తి

BRS Party | కుమ్మెర జాత‌ర‌లో రెండు నెల‌ల ప‌సికందును చంపిన వారిని శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Feb 23, 2026, 2.42 pm IST

BRS Party | ప‌సికందును చంపిన వారిని శిక్షించండి.. డీజీపీకి బీఆర్ఎస్ నేత‌ల విన‌తి
Advertisement

BRS Party | త్రినేత్ర‌.న్యూస్ : కుమ్మెర జాత‌ర‌లో రెండు నెల‌ల ప‌సికందును చంపిన వారిని శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అగ్రకులానికి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు రజక కులానికి చెందిన రెండు నెలల పసికందును కాలితో త‌న్ని చంపేశారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జ‌రిపి నిజాలు వెలికితీయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

డీజీపీ ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు బీసీ క‌మిష‌న్ మాజీ స‌భ్యులు కిశోర్ గౌడ్‌, ఉపేంద‌ర్ చారి, మాజీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ బాల‌రాజు యాద‌వ్, నేత‌లు స్వామి యాద‌వ్, రాజు త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement
Advertisement