Karne Prabhakar | ఏకపక్ష నిర్ణయం.. రేవంత్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం : మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
Karne Prabhakar | యాదాద్రి అభివృద్ధి సంస్థ (YTDA)లో యాదాద్రి జిల్లా ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు.
Karne Prabhakar | త్రినేత్ర.న్యూస్ : యాదాద్రి అభివృద్ధి సంస్థ (YTDA)లో యాదాద్రి జిల్లా ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు.
దేవుడి మీద ప్రమాణం చేసి ప్రజలను నమ్మించిన రేవంత్ రెడ్డి, అదే దేవుడిపై శఠగోపం పెట్టి రాజకీయాలు చేయడం దురదృష్టకరం. యాదగిరిగుట్ట పేరుతో ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, యాదాద్రి అభివృద్ధి సంస్థ (YTDA)లో కనీస ప్రాతినిధ్యం కూడా కల్పించకపోవడం పట్ల భారత రాష్ట్ర సమితి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని దేశంలోనే అత్యంత వైభవోపేత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.1800 కోట్ల వ్యయంతో యాదాద్రిని అభివృద్ధి చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పారని కర్నె ప్రభాకర్ గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది..
దేవాలయ అభివృద్ధి కోసం పరిసర గ్రామాల ప్రజలు తమ భూములను స్వచ్ఛందంగా సమర్పించి, భక్తితో సహకరించారు. యాదాద్రి అభివృద్ధిలో స్థానిక ప్రజల పాత్ర, సహకారం ఎంతో గొప్పవి. అలాంటి ప్రాంతం నుండి వైటీడీఏలో స్థానం లేకపోవడం అన్యాయం. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ప్రశ్నించడం గమనార్హం. యాదాద్రి జిల్లా ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
రాక్షసానందం పొందాలనుకుంటున్నాడు
తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్ నిర్మించిన సంస్థలను రాజకీయ కక్షతో బలహీనపరచడం, వ్యవస్థలను నిర్వీర్యం చేసి తద్వారా రాక్షసానందం పొందాలనుకుంటున్నాడు. యాదాద్రి జిల్లా పేరుతో ఏర్పడిన అభివృద్ధి సంస్థలో అదే జిల్లా ప్రజలకు, స్థానికులకు, దేవాలయ అభివృద్ధికి భూములు ఇచ్చిన కుటుంబాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది అని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Komatireddy Rajagopal Reddy | పాత కాంగ్రెస్ నేతలంతా కనుమరుగు.. రేవంత్ నాకు నచ్చడం లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
జులై 1, 2026

Tunga Balu | యాదాద్రి ట్రస్ట్ బోర్డులో స్థానికులకు చోటేది..? నిలదీసిన తుంగ బాలు
జులై 1, 2026

MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్.. రావణాసురుడి బాటలో బీజేపీ
జులై 1, 2026
తాజావార్తలు
- ●POCSO Case Hyderabad | చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై దారుణం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి ఐదేళ్ల జైలు!
- ●Jagga Reddy | మీకు శ్రీరాముడు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా..? బీజేపీని నిలదీసిన జగ్గారెడ్డి
- ●Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. 'యాప్'తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!
- ●Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్లో 8-4-3 రూల్.. ఏంటిది.. దీంతో భారీ కార్పస్ ఎలా సాధ్యమవుతుంది..?
- ●KTR Challenges Revanth Reddy | బాహుబలిలో భల్లాల దేవుడి గతే రేవంత్కి పడుతుంది..!

POCSO Case Hyderabad | చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై దారుణం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి ఐదేళ్ల జైలు!

Jagga Reddy | మీకు శ్రీరాముడు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా..? బీజేపీని నిలదీసిన జగ్గారెడ్డి

Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. 'యాప్'తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!

Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు



