త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | కొన‌సాగుతున్న రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌.. నేడు 3 ఎక‌రాల్లోపు రైతుల‌కు

Rythu Bharosa | రాష్ట్రంలో అర్హ‌త రైతుల‌కు రైతు భ‌రోసా( Rythu Bharosa ) నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 2 ఎక‌రాల్లోపు రైతుల‌కు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌గా, బుధ‌వారం మూడు ఎక‌రాల్లోపు రైతుల‌కు నిధులు విడుద‌ల చేశారు.

S

Telangana | Published On Jul 1, 2026, 5.14 pm IST

Rythu Bharosa | కొన‌సాగుతున్న రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌.. నేడు 3 ఎక‌రాల్లోపు రైతుల‌కు
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అర్హ‌త రైతుల‌కు రైతు భ‌రోసా( Rythu Bharosa ) నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 2 ఎక‌రాల్లోపు రైతుల‌కు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌గా, బుధ‌వారం మూడు ఎక‌రాల్లోపు రైతుల‌కు నిధులు విడుద‌ల చేశారు.

బుధ‌వారం రెండో ద‌శ‌లో భాగంగా 10.68 ల‌క్ష‌ల రైతుల ఖాతాల్లో రూ. 1590.02 కోట్లు జ‌మ చేసిన‌ట్లు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ప్ర‌క‌టించారు. ఇప్పటివరకు మొత్తం 54.96 లక్షల మంది రైతులకు చెందిన 67.87 ఎకరాలకు రైతుభరోసా చెల్లించామ‌ని తెలిపారు. రైతుభరోసా కింద ఇప్పటివరకు 4072.04 కోట్లు విడుదల చేశామ‌న్నారు.

సిద్దిపేటలో యూరియా బ‌స్తాల అక్ర‌మాలు

యూరియా యాప్ ద్వారా సిద్దిపేటలో యూరియా బస్తాల అక్రమాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు పేర్కొన్నారు. 6000 యూరియా బస్తాలు మాయమైన కేసులో డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామ‌న్నారు. వ్యవసాయశాఖ అధికారిని కూడా సస్పెండ్ చేశాం. యూరియా యాప్ వల్లే అక్రమాలను గుర్తించడం సాధ్యమైంది. యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయి. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని మంత్రి తుమ్మల స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement