త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threat | నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు..

Bomb Threat | హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టుతోపాటు క‌రీంన‌గ‌ర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వ‌చ్చాయి. 12 చోట్ల‌ ఆర్డీఎక్స్ బాంబులు (RDX Bombs) అమ‌ర్చామ‌ని, అవి మ‌ధ్య‌హ్నం 12 గంట‌ల 5 నిమిషాల‌కు పేలుతాయంటూ ఫోన్‌లో బెదిరించారు.

G

Telangana | Published On Feb 18, 2026, 1.01 pm IST

Bomb Threat | నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు..
Advertisement

Bomb Threat | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టుతోపాటు క‌రీంన‌గ‌ర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వ‌చ్చాయి. 12 చోట్ల‌ ఆర్డీఎక్స్ బాంబులు (RDX Bombs) అమ‌ర్చామ‌ని, అవి బుధ‌వారం మ‌ధ్య‌హ్నం 12 గంట‌ల 5 నిమిషాల‌కు పేలుతాయంటూ ఫోన్‌లో బెదిరించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు రెండు కోర్టుల్లో న్యాయ‌వాదులు, సిబ్బందిని బ‌య‌ట‌కు పంపించారు. డాగ్ స్క్వాడ్ బృందాల‌తో త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఎలాంటి పేలుడు ప‌దార్థాలు లేక‌పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ కాల్స్ త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చాయ‌ని, అవి ఫేక్ అని పోలీసులు నిర్ధారించారు. గ‌తేడాది డిసెంబర్ 18న ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రి, , అనంతపురం జిల్లా కోర్టులకు కూడా ఇదే త‌ర‌హా బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఇటీవ‌ల కాలంలో త‌రచుగా కోర్టుల‌కు, పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు వ‌స్తున్నాయి.

 

Advertisement
Advertisement