త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alleti Maheshwar Reddy | 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వ‌హించాలి : ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

Alleti Maheshwar Reddy | ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు క‌నీసం 20 రోజులైనా తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించాల‌ని బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Mar 16, 2026, 6.45 pm IST

Alleti Maheshwar Reddy | 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వ‌హించాలి : ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి
Advertisement

Alleti Maheshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు క‌నీసం 20 రోజులైనా తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించాల‌ని బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఏసీ స‌మావేశం ముగిసిన అనంత‌రం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మ‌హేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఐదారు రోజుల్లో ప‌ద్దుల మీద చ‌ర్చ జ‌రిపి.. బ‌డ్జెట్ ఆమోదం పొందేందుకు ఈ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఈ స‌మావేశాల్లో రైతుబంధు, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్, రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు రావాల్సిన బ‌కాయిల విష‌యంలోనూ, ఎంప్లాయిస్‌కు రావాల్సిన డీఏల విష‌యంలోనూ, ఆటో డ్రైవ‌ర్ల హామీల‌పై, ఆరు గ్యారెంటీలు, 420 హామీల‌పై చ‌ర్చించేందుకు అవ‌కాశం లేకుండా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను కుదిస్తున్నారు. ఆరేడు రోజుల పాటు నిర్వ‌హించే స‌మావేశాల్లోనే కార్పొరేష‌న్ డీ లిమిటేష‌న్‌, పంచాయ‌తీ రాజ్, హైడ్రా విష‌యంలో చ‌ర్చ తీసుకొచ్చి ప‌ద్దుల విష‌యంలో చ‌ర్చ‌ త‌గ్గించేలా చేస్తున్నారు. 30న ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ పెట్టినా కూడా ఇంకా ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద చ‌ర్చించ‌డానికి క‌నీసం 20 రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాలు న‌డ‌పాల‌ని డిమాండ్ చేశాం. కానీ శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నుంచి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డం బాధాక‌రం అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement