త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | తెలంగాణ‌లో దోస్తీ.. కేర‌ళ‌లో కుస్తీ.. రేవంత్‌పై రామ‌చంద‌ర్ రావు ఫైర్

Ramchander Rao | కేర‌ళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు నిప్పులు చెరిగారు. కమ్యూనిస్టుల‌తో తెలంగాణ‌లో దోస్తీ చేస్తూ.. కేర‌ళ‌లో మాత్రం కుస్తీ ప‌డుతున్నారంటూ రేవంత్‌పై రామ‌చంద‌ర్ రావు సెటైర్లు వేశారు.

S

Telangana | Published On Apr 1, 2026, 6.24 pm IST

Ramchander Rao | తెలంగాణ‌లో దోస్తీ.. కేర‌ళ‌లో కుస్తీ.. రేవంత్‌పై రామ‌చంద‌ర్ రావు ఫైర్
Advertisement

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : కేర‌ళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు నిప్పులు చెరిగారు. కమ్యూనిస్టుల‌తో తెలంగాణ‌లో దోస్తీ చేస్తూ.. కేర‌ళ‌లో మాత్రం కుస్తీ ప‌డుతున్నారంటూ రేవంత్‌పై రామ‌చంద‌ర్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ, నేత‌లు కేర‌ళ ప్ర‌జ‌ల‌పై క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

రేవంత్ ఏమ‌న్నారంటే..?

‘‘కేరళ ప్రజలు తెలివైనవారు, విద్యావంతులు. ఇక్కడి ప్రజలు మతతత్వ శక్తులను అనుమతించరు. అలాంటి వారు అధికారంలోకి రాకుండా లక్ష్మణరేఖ గీశారు. కేరళకు భవిష్యత్తు లేకుండా చేయాలని మోదీ, పినరయి విజయన్‌ చూస్తున్నారు. కేరళలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలవకూడదని ప్రయత్నిస్తున్నారు. భాజపా ఓటు బ్యాంకు పినరయికి బదిలీ అయ్యేలా చేస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని రేవంత్‌ కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement