త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే.. కానీ ఇండ్ల‌ను కూల్చొద్దు : రామ‌చంద‌ర్ రావు

Ramachander Rao | మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే.. కానీ ఇండ్ల‌ను కూల్చొద్ద‌ని బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సూచించారు. గాంధీ స‌రోవ‌ర్, మూసీ సుందరీక‌ర‌ణ పేరుతో పేదోళ్ల ఇండ్ల‌ను కూల్చివేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 13, 2026, 5.31 pm IST

Ramachander Rao | మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే.. కానీ ఇండ్ల‌ను కూల్చొద్దు : రామ‌చంద‌ర్ రావు
Advertisement

Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే.. కానీ ఇండ్ల‌ను కూల్చొద్ద‌ని బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సూచించారు. గాంధీ స‌రోవ‌ర్, మూసీ సుందరీక‌ర‌ణ పేరుతో పేదోళ్ల ఇండ్ల‌ను కూల్చివేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రామ‌చంద‌ర్ రావు శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

మూసీ ప్ర‌క్షాళ‌న‌కు, గాంధీ స‌రోవ‌ర్‌కు బీజేపీ వ్య‌తిరేకం కాదు. కృష్ణా న‌దిలో క‌లిసేంత వ‌ర‌కు మూసీ న‌ది స్వ‌చ్ఛంగా ఉండాలి. దిగువ‌న ఉన్న రైతాంగానికి నాణ్య‌తతో కూడిన‌ సాగు నీరు అందించాలి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో, దేశంలో బీజేపీకి ఒక విధాన‌మంటూ లేద‌న్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే. కానీ గాంధీ స‌రోవ‌ర్ పేర‌టి ఇండ్ల‌ను కూల‌గొట్టడం స‌రికాదు. లీగ‌ల్‌గా ఉన్న ఇండ్ల‌ను కూల‌గొట్ట‌డానికి అవ‌కాశం లేదు. కూల‌గొట్టకుండా కూడా సుందరీక‌ణ చేయొచ్చు. నదుల ప్రక్షాళన ఎలా చేయాలో స‌బర్మతి నదిని చూసి నేర్చుకోండి. ప్ర‌ధాని మోదీ గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు నిర్వాసితుల‌కు ముందుగా ఇళ్లు క‌ట్టించి, పున‌రావాసం క‌ల్పించిన త‌ర్వాతే స‌బ‌ర్మ‌తి ప్ర‌క్షాళ‌న చేప‌ట్టారు అని రామ‌చంద‌ర్ రావు గుర్తు చేశారు.

కానీ మీరు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి, గ‌డ్డ‌పార చేతుల పట్టుకొని ఇండ్లు కూల‌గొట్టేందుకు తిరుగుతున్నారు. నిరుపేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఇండ్ల‌ను కూల‌గొడితే త‌ప్ప‌కుండా వ్య‌తిరేకిస్తాం. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు నాలుగైదు వంద‌ల ఎక‌రాల భూమి ఎందుకు..? రీ లైన్‌మెంట్ చేసుకోండి.. గాంధీ విగ్ర‌హం ఆకాశం దాకా పెట్టినా అభ్యంత‌రం లేదు. సంతోషిస్తాం. ఇండ్ల‌ను కూల‌గొట్టి ప్ర‌క్షాళ‌న చేస్తే స‌రికాదు అని రామ‌చంద‌ర్ రావు ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement