త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | కొండ‌గ‌ట్టుకు బండి పాద‌యాత్ర‌.. డ్రోన్ తాకి తేనెటీగ‌ల దాడి

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అంజన్న ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు (Kondagattu) వరకు మహా పాదయాత్ర (Foot march) చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేప‌ట్టారు.

S

Telangana | Published On Mar 14, 2026, 5.37 pm IST

Bandi Sanjay | కొండ‌గ‌ట్టుకు బండి పాద‌యాత్ర‌.. డ్రోన్ తాకి తేనెటీగ‌ల దాడి
Advertisement

 

త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అంజన్న ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు (Kondagattu) వరకు మహా పాదయాత్ర (Foot march) చేపట్టారు. కరీంనగర్‌ మేయర్‌ పీఠం భాజపా గెలుచుకుంటే కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కాలినడకన కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటానని బండి ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేప‌ట్టారు. ఈ పాదయాత్రకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు.

తేనెటీగ‌ల దాడి...

క‌రీంన‌గ‌ర్ జిల్లా రామడుగు మండలం కోన్‌రావు పేట(Konaraopet) లో పాదయాత్రను చిత్రీకరించేందుకు కార్యకర్తలు డ్రోన్‌ (Drone) ఎగరేశారు. ఈ క్ర‌మంలో అది పక్కనే చెట్టుకున్న తేనెతుట్టెను తాకింది. దీంతో ఒక్కసారిగా కొందరు కార్యకర్తలపై అవి దాడి చేశాయి. ఈ ప్ర‌మాదంలో గాయపడిన‌ కార్యకర్తలకు బండి సంజ‌య్‌ వైద్యం చేయించారు. అనంత‌రం మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. సాయంత్రం 6.30 కల్లా కొండగట్టుకు చేరుకునేలా సంజయ్‌ యాత్ర సాగిస్తున్నారు.

Advertisement
Advertisement