త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | స‌నాత‌న ధ‌ర్మంపై దాడికి పాల్ప‌డితే ఖ‌బ‌డ్దార్‌.. శివాల‌యం కూల్చివేత‌పై బండి సంజ‌య్ ఆగ్ర‌హం

Bandi Sanjay | వ‌రంగ‌ల్‌లో ప్రాచీన శివాల‌యం కూల్చివేత‌పై కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుళ్లపై, దేవాలయాలపై ఎందుకంత ద్వేషమ‌ని మండిప‌డ్డారు.

G

Telangana | Published On May 8, 2026, 12.16 pm IST

Bandi Sanjay | స‌నాత‌న ధ‌ర్మంపై దాడికి పాల్ప‌డితే ఖ‌బ‌డ్దార్‌.. శివాల‌యం కూల్చివేత‌పై బండి సంజ‌య్ ఆగ్ర‌హం
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌రంగ‌ల్‌లో ప్రాచీన శివాల‌యం కూల్చివేత‌పై కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుళ్లపై, దేవాలయాలపై ఎందుకంత ద్వేషమ‌ని మండిప‌డ్డారు. తక్షణమే వరంగల్ ఆలయాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. లేన‌ట్ల‌యితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల‌న్నారు.

కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్ర‌శ్నించారు. హిందూ దేవుళ్ల పేరు వింటే కాంగ్రెస్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయ‌ని చెప్పారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సంస్కృతి, సనాతన ధర్మంపై దాడికి పాల్పడితే ఖబడ్దార్ అని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement