త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandaru Dattatreya | ప్ర‌జ‌ల క‌థే నా ఆత్మ‌క‌థ‌.. మోదీకి అందించిన బండారు ద‌త్తాత్రేయ‌

Bandaru Dattatreya | హ‌ర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రయ మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం మొదటిసారిగా ప్ర‌ధానిని ద‌త్తాత్రేయ క‌లిశారు.

S

Telangana | Published On Mar 10, 2026, 5.06 pm IST

Bandaru Dattatreya | ప్ర‌జ‌ల క‌థే నా ఆత్మ‌క‌థ‌.. మోదీకి అందించిన బండారు ద‌త్తాత్రేయ‌
Advertisement

Bandaru Dattatreya | త్రినేత్ర‌.న్యూస్ : హ‌ర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రయ మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం మొదటిసారిగా ప్ర‌ధానిని ద‌త్తాత్రేయ క‌లిశారు. ఈ సందర్భంగా తనకు మోదీ మొదటి క్యాబినెట్‌లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, అనంతరం హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ తన ఆత్మకథ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ పుస్తకం ఎంతో మందికి ప్రేరణనిచ్చే విధంగా ఉందని మోదీ అభినందించారని దత్తాత్రేయ తెలిపారు. సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ దత్తాత్రేయ ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు చేశారు. స్పందించిన బండారు దత్తాత్రేయ తాను ఆరోగ్యంగా ఉన్నానని, దాదాపు అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నానని తెలిపారు. ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ చాలా సంతోషమని, ఇదే ఉత్సాహంతో ప్రజా జీవితంలో కొనసాగాలని మోదీ సూచించినట్లు దత్తాత్రేయ తెలిపారు.

Advertisement
Advertisement