త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | బోల్తా ప‌డ్డ అయ్య‌ప్ప భ‌క్తుల బ‌స్సు.. 15 మందికి గాయాలు

Road Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్న‌మ‌య్య జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సాంబేప‌ల్లి వ‌ద్ద అయ్య‌ప్ప భ‌క్తుల‌కు చెందిన మినీ బ‌స్సు బోల్తా ప‌డింది.

S

Telangana | Published On Dec 26, 2025, 10.21 am IST

Road Accident | బోల్తా ప‌డ్డ అయ్య‌ప్ప భ‌క్తుల బ‌స్సు.. 15 మందికి గాయాలు
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్న‌మ‌య్య జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సాంబేప‌ల్లి వ‌ద్ద అయ్య‌ప్ప భ‌క్తుల‌కు చెందిన మినీ బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులోని 15 మంది భ‌క్తుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ భ‌క్తుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అతి వేగం వ‌ల్ల అయ్య‌ప్ప భ‌క్తుల బ‌స్సు డివైడ‌ర్‌ను ఢీకొట్టి బోల్తా ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. భ‌క్తులంద‌రూ శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకుని హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement