త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ASI | పోలీస్ వాహ‌నం ఢీకొని ఏఎస్ఐ మృతి.. క‌క్ష‌తోనే హోంగార్డు చంపాడంటున్న కుటుంబం!

ASI | సంగారెడ్డి జిల్లా మానూర్‌లో పోలీసు వాహ‌నం ఢీకొని ఓ ఏఎస్ఐ (ASI) మృతిచెందారు. ప‌నిచేస్తున్న స్టేష‌న్ ఎదుటే ఈ ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

G

Telangana | Published On Apr 14, 2026, 9.24 am IST

ASI | పోలీస్ వాహ‌నం ఢీకొని ఏఎస్ఐ మృతి.. క‌క్ష‌తోనే హోంగార్డు చంపాడంటున్న కుటుంబం!
Advertisement

ASI | త్రినేత్ర‌.న్యూస్‌: సంగారెడ్డి జిల్లా మానూర్‌లో పోలీసు వాహ‌నం ఢీకొని ఓ ఏఎస్ఐ (ASI) మృతిచెందారు. ప‌నిచేస్తున్న స్టేష‌న్ ఎదుటే ఈ ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. సోమ‌వారం రాత్రి ఏఎస్‌ఐ గోవింద్‌ నాయక్‌పైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న‌ను తోటి సిబ్బండి వెంటనే నారాయ‌ణఖేడ్ ద‌వాఖాన‌కు తరలించారు. అయితే ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో మృతిచెందారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ పోలీస్ వాహన డ్రైవర్‌ హోంగార్డు రామారావు పరారీలో ఉన్నాడు.

కాగా, హోంగార్డు రామారావు కక్షపూరితంగానే ఈ ప్రమాదం చేశాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement