త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ASHA Workers | జీతాల కోసం ఆశా వ‌ర్క‌ర్ల ధ‌ర్నా.. ఈడ్చుకెళ్లిన పోలీసులు

ASHA Workers | ఆశా వ‌ర్క‌ర్లు మ‌రోసారి పోరుబాట ప‌ట్టారు. మూడు నెల‌ల నుంచి జీతాల్లేక అల్లాడిపోతున్నామ‌ని ఆశా వ‌ర్క‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే మూడు నెల‌ల జీతాలు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాల‌యం ఎదుట ఆశా వ‌ర్క‌ర్లు ధ‌ర్నా చేప‌ట్టారు.

S

Telangana | Published On Feb 23, 2026, 4.06 pm IST

ASHA Workers | జీతాల కోసం ఆశా వ‌ర్క‌ర్ల ధ‌ర్నా.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
Advertisement

ASHA Workers | త్రినేత్ర‌.న్యూస్ : ఆశా వ‌ర్క‌ర్లు మ‌రోసారి పోరుబాట ప‌ట్టారు. మూడు నెల‌ల నుంచి జీతాల్లేక అల్లాడిపోతున్నామ‌ని ఆశా వ‌ర్క‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే మూడు నెల‌ల జీతాలు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాల‌యం ఎదుట ఆశా వ‌ర్క‌ర్లు ధ‌ర్నా చేప‌ట్టారు.

రూ. 18 వేలు కనీసం వేతనం, ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500 పారితోషికాలను వెంటనే అమలు చేయాలని ఆశా వ‌ర్క‌ర్లు డిమాండ్ చేశారు. ఆశా వ‌ర్క‌ర్ల సంక్షేమం కోసం ఈ బ‌డ్జెట్‌లో నిధులు పెంచాల‌ని వారు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలీసుల అత్యుత్సాహం..

శాంతియుతంగా ధ‌ర్నా చేప‌ట్టిన ఆశా వ‌ర్క‌ర్ల ప‌ట్ల పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఆశాల‌కు ఆటంకం క‌ల్పించారు. న‌డిరోడ్డుపై ఈడ్చుకెళ్లి.. బ‌ల‌వంతంగా పోలీసు వ్యాన్ల‌లో ఎక్కించారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన ఆశాలు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. త‌మ డిమాండ్ల‌ను త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చాల‌ని, లేదంటే ఆందోళ‌న‌లు త‌ప్ప‌వ‌ని ఆశాలు హెచ్చ‌రించారు.

స్పృహ త‌ప్పిన ఆశా వ‌ర్క‌ర్

పోలీసుల తోపులాటలో ఓ ఆశా వ‌ర్క‌ర్ స్పృహతప్పి పడిపోయారు. అప్ర‌మ‌త్త‌మైన తోటి ఆశాలు.. ఆమెకు సేవ‌లు చేశారు. అనంత‌రం అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసుల తీరుపై ఆశాలు మండిప‌డ్డారు.

https://x.com/TeluguScribe/status/2025836741777875359

Advertisement
Advertisement