Accident Insurance Scheme | ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం.. రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ప్రయోజనం
Accident Insurance Scheme | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Govt Employees) సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమాద జీవిత బీమా పథకాన్ని (Accident Insurance Scheme) ప్రారంభించనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Accident Insurance Scheme | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Govt Employees) సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమాద జీవిత బీమా పథకాన్ని (Accident Insurance Scheme) ప్రారంభించనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉద్యోగలు సమక్షంలో మొత్తం 14 బ్యాంకులు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోనున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు ప్రమాద బీమా వర్తించనుంది. వీరితోపాటు కాంట్రాక్టు, పొరుగుసేవల వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు తెలుస్తున్నది. దీనిద్వారా దాదాపు పది లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగనుంది.
ప్రీమియం లేకుండానే..
దీనికోసం ఉద్యోగులు ప్రీమియం కింద ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. సాలరీ ఖాతాలున్న బ్యాంకుల ద్వారా పథకం అమలుచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే వారి సాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకులో నామినీకి రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ బీమా పరిహారం లభిస్తుంది. అయితే పరిహారం ఎంత ఇవ్వాలనే అంశంపై ఒక్కో బ్యాంకు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నది. కొన్ని బ్యాంకులు రూ.60 లక్షల నుంచి రూ.కోటి పరిహరం ఇస్తామని ప్రకటించగా, అత్యధిక వేతన ఖాతాలున్న బ్యాంకులు రూ.కోటి ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే సింగరేణిలో..
ప్రమాద జీవిత బీమా పథకం ఇప్పికే సింగరేణి ఉద్యోగులకు అమల్లో ఉన్నది. 2024లో యూనియన్ బ్యాంకు మొదటగా సింగరేణి ఉద్యోగులకు బీమా పథకాన్ని ప్రారంభించింది. దీనిని మిగిలిన బ్యాంకులు కూడా అనుసరిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 45 మంది ఉద్యోగులు ప్రమాదాల్లో మరణించగా వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా పరిహారాన్ని బ్యాంకులు చెల్లించాయి. ఇటీవల సహజ మరణాలకు కూడా రూ.10 లక్షలు అందించేందుకు ముందుకు వచ్చాయి.
సంబంధిత వార్తలు

Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హరీశ్రావు అక్రమాల వల్లే రైతుల ఆత్మహత్య : గువ్వల బాలరాజు
జూన్ 24, 2026

Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు
జూన్ 24, 2026

Sanjay Jaju | 12 ఏండ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి.. కొత్త సీఎస్గా సంజయ్ జాజు!
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..
- ●Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్షం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్
- ●Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?
- ●Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేలపై పడేసి కాలితో తొక్కిన కుమారుడు
- ●Bengaluru Metro | నిలిచిన మెట్రో రైళ్లు.. లారీలు, ట్రక్కులు ఎక్కిన టెకీలు
- ●Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హరీశ్రావు అక్రమాల వల్లే రైతుల ఆత్మహత్య : గువ్వల బాలరాజు

Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..

Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్షం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్

Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?

Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేలపై పడేసి కాలితో తొక్కిన కుమారుడు



