త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha | రాజ్య‌స‌భ స‌భ్యులుగా వేం న‌రేంద‌ర్ రెడ్డి, సింఘ్వీ ఏక‌గ్రీవం

Rajya Sabha | తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్ర‌తిప‌క్షాల నుంచి పోటీ లేక‌పోవ‌డంతో.. అధికార పార్టీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల ఎన్నికకు మార్గం సుగ‌మ‌మైంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలో దిగిన అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేంద‌ర్ రెడ్డి ఎన్నిక ఏక‌గ్రీవమైంది.

S

Telangana | Published On Mar 9, 2026, 6.30 pm IST

Rajya Sabha | రాజ్య‌స‌భ స‌భ్యులుగా వేం న‌రేంద‌ర్ రెడ్డి, సింఘ్వీ ఏక‌గ్రీవం
Advertisement

ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందుకున్న వేం, సింఘ్వీ అడ్వ‌కేట్

Rajya Sabha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్ర‌తిప‌క్షాల నుంచి పోటీ లేక‌పోవ‌డంతో.. అధికార పార్టీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల ఎన్నికకు మార్గం సుగ‌మ‌మైంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలో దిగిన అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేంద‌ర్ రెడ్డి ఎన్నిక ఏక‌గ్రీవమైంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల అధికారి ఉపేంద‌ర్ రెడ్డి నుంచి వేం న‌రేంద‌ర్ రెడ్డి, సింఘ్వీ త‌ర‌పున ఆయ‌న అడ్వ‌కేట్ ఎన్నిక‌ల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా వేం నరేంద‌ర్ రెడ్డికి, అభిషేక్ మ‌ను సింఘ్వీకి కాంగ్రెస్ నాయ‌క‌త్వం శుభాకాంక్ష‌లు తెలిపింది.

సింఘ్వీ మూడు.. నరేందర్‌రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి కూడా నామినేషన్‌ వేశారు. అయితే.. 10 మంది ఎమ్మెల్యేల మద్దతు సంతకాలు లేకపోవడంతో ఆ నామినేషన్‌ను శుక్రవారం పరిశీలన అనంతరం రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణకు గడువు ముగియ‌డంతో వీరిద్దరి ఎన్నికను రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ప్రకటించి, ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌జేశారు.

Advertisement
Advertisement