త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad | పొర‌పాటున పేలిన తుపాకీ.. ఇన్‌స్పెక్ట‌ర్ మృతి

Nizamabad | పొర‌పాటున తుపాకీ పేలింది. ఆ బుల్లెట్ పోలీసు శ‌రీరంలోకి దూసుకెళ్లింది. దీంతో పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.

S

Telangana | Published On Sep 18, 2026, 10.03 am IST

Nizamabad | పొర‌పాటున పేలిన తుపాకీ.. ఇన్‌స్పెక్ట‌ర్ మృతి
Advertisement

Nizamabad | త్రినేత్ర‌.న్యూస్ : పొర‌పాటున తుపాకీ పేలింది. ఆ బుల్లెట్ పోలీసు శ‌రీరంలోకి దూసుకెళ్లింది. దీంతో పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రిజ‌ర్వ్ ఇన్‌స్పెక్ట‌ర్ హెచ్ స‌తీశ్ రాత్రి విధులు ముగించుకుని శుక్ర‌వారం తెల్ల‌వారుజామున పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్‌కు చేరుకున్నారు. ఆ త‌ర్వాత తుపాకీని శుభ్రం చేస్తుండ‌గా.. అది పొర‌పాటున పేలింది. దీంతో బుల్లెట్ స‌తీశ్ శ‌రీరంలోకి చొచ్చుకెళ్లింది. తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి స‌తీశ్ ప్రాణాలు కోల్పోయారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని నిజామాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సాయి చైత‌న్య ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు.

Advertisement
Advertisement