త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adilabad | నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్.. అత్య‌ధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు

Adilabad | ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా త‌యారైంది. ఈ జిల్లాలో అత్య‌ధికంగా 46 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదై.. ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

S

Telangana | Published On Apr 29, 2026, 7.14 pm IST

Adilabad | నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్.. అత్య‌ధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు
Advertisement

Adilabad | త్రినేత్ర‌.న్యూస్ : ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా త‌యారైంది. ఈ జిల్లాలో అత్య‌ధికంగా 46 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదై.. ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ‌లో 45.9, జ‌గిత్యాల జిల్లాలోని రాయిక‌ల్‌లో 45.8, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.8, నిర్మ‌ల్ జిల్లా భైంసాలో 45.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మోర్సాలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నిన్న నిజామాబాద్ జిల్లాలో అత్య‌ధికంగా 44.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీలు, మెద‌క్ జిల్లాలో 43 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో బేగంపేట్‌లో అత్య‌ధికంగా 42 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. సాధార‌ణం కంటే 2.6 డిగ్రీలు ఎక్కువ‌. హ‌కీంపేట్‌లో 41.7, హ‌య‌త్‌న‌గ‌ర్‌లో 41, రాజేంద్ర‌గ‌న‌ర్‌లో 40.5, ప‌టాన్‌చెరులో 40.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

Advertisement
Advertisement