త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pani Puri | పానీపూరీ తిని 18 మంది చిన్నారుల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌..

Pani Puri | రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లంలోని విషాదం చోటుచేసుకుంది. పానీపూరీ (Pani Puri) తిని 18 మంది చిన్నారులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

G

Telangana | Published On Jun 17, 2026, 9.05 am IST

Pani Puri | పానీపూరీ తిని 18 మంది చిన్నారుల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌..
Advertisement

Pani Puri | త్రినేత్ర‌.న్యూస్‌: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లంలోని విషాదం చోటుచేసుకుంది. పానీపూరీ (Pani Puri) తిని 18 మంది చిన్నారులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కేసీఆర్ న‌గ‌ర్ కాల‌నీకి (KCR Nagar) చెందిన చిన్నారులు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వ‌ద్ద పానీపూరి తిన్నారు. కాసేప‌టికే కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. మరి కొందరు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని సిరిసిల్ల ప్రభుత్వ ద‌వాఖాన‌తో పాటు ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌కు తరలించారు.

వారిలో రిషికేశ్‌ అనే బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో ఫిట్స్ వచ్చింద‌ని కుటుంబ సభ్యులు తెలిపారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్న‌ది. కాగా, చిన్నారులందరికీ ఒకే తరహా లక్షణాలు కనిపించడంతో ఆహారం క‌లుషితమై (Food Poisoning) ఉండొచ్చని వైద్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వారి అనారోగ్యానికి గల అసలు కారణాలను నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement