త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Bhatti Vikramarka | విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు – డీఏ పెంపుపై డిప్యూటీ సీఏం ఆమోదం

విద్యుత్ శాఖ ఉద్యోగుల డీఏ పెంపుపై తెలంగాణ డిప్యూటీ సీఏం ఆమోదముద్ర వేశారు. 17.651 డీఏను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా  71 వేలకు మందికిపైగా ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.

a

Telangana | Published On Dec 22, 2025, 7.35 pm IST

Mallu Bhatti Vikramarka | విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు – డీఏ పెంపుపై డిప్యూటీ సీఏం ఆమోదం
Advertisement

Mallu Bhatti Vikramarka | విద్యుత్ శాఖ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. 17.651 శాతం డియర్ నెస్ అలవెన్స్ (DA) ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది విద్యుత్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. బహిరంగ మార్కెట్ లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి ఏడాది జనవరి, జులై నెలల్లో డియర్ నెస్ అలవెన్స్ (DA)/డియర్ నెస్ రిలీఫ్ (DR) ను సమీక్షిస్తూ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది జూలై 1నంచి నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెరిగిన డీఏ ప్ర‌కారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగుల‌కు, 3,769 మంది ఆర్టిజ‌న్ల‌కు, 2,446 మంది పెన్ష‌న‌ర్ల‌కు మొత్తంగా 9,251 మందికి ప్రయోజనం చేకూర‌నుంది. జెన్ కో విష‌యానికి వ‌స్తే 6,913 మంది ఉద్యోగుల‌కు 3,583 మంది ఆర్టిజ‌న్ల‌కు, 3,579 మంది పెన్ష‌న‌ర్లు లాభపడనున్నారు. ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగుల‌కు 8,244 మంది ఆర్టిజ‌న్ల‌కు, 8,244 మంది పెన్ష‌న‌ర్ల‌ లబ్ధి చేకూరనుంది. ఎన్పీడీసీఎల్ ప‌రిధిలో 9,728 మంది ఉద్యోగుల‌కు 3,465 మంది ఆర్టిజ‌న్ల‌కు, 6,115 మంది పెన్ష‌న‌ర్ల‌కు లాభపడనున్నారు. పెరిగిన డీఏ కారణంగా విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా 9.39 కోట్ల అదనపు భారం పడనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement