Emergency Alerts | దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్లతో మోగిన ఫోన్లు.. ఆందోళన చెందిన ప్రజలు..
Emergency Alerts | దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు శనివారం ఒక్కసారిగా గట్టిగా వినిపించిన ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం కలకలం రేపింది. ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్స్ పేరుతో వచ్చిన ఈ నోటిఫికేషన్ ను చూసి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది కేవలం టెస్ట్ మాత్రమేనని అధికారులు వెంటనే స్పష్టం చేశారు.
Technology | Published On May 2, 2026, 12.30 pm IST
Emergency Alerts | దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు శనివారం ఒక్కసారిగా గట్టిగా వినిపించిన ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం కలకలం రేపింది. ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్స్ పేరుతో వచ్చిన ఈ నోటిఫికేషన్ ను చూసి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది కేవలం టెస్ట్ మాత్రమేనని అధికారులు వెంటనే స్పష్టం చేశారు. ఈ సందేశం డిజాస్టర్ వార్నింగ్ల కోసం రూపొందించిన సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ పరీక్షలో భాగమని, ఎటువంటి చర్య అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. పలు నెట్వర్క్లు, డివైస్లలో ఈ అలర్ట్ అందినట్లు వినియోగదారులు తెలిపారు. ఈ దేశవ్యాప్త అలర్ట్ ట్రిగ్గర్ కొత్త ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ పరీక్ష దశలో భాగం అని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అలర్ట్లు వినియోగదారులకు వేగంగా, నమ్మదగిన విధంగా చేరుతున్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ప్రాంతీయ భాషల్లోనూ అలర్ట్..
ఈ అలర్ట్ హై ప్రాధాన్యత నోటిఫికేషన్ రూపంలో ప్రత్యేక శబ్దంతో మొబైల్ స్క్రీన్లపై ప్రత్యక్షమైంది. కొన్ని సందర్భాల్లో ఇది పునరావృతమైంది కూడా. సందేశంలో దిస్ ఈజ్ ఎ టెస్ట్ సెల్ బ్రాడ్కాస్ట్ మెసేజ్... ప్లీజ్ ఇగ్నోర్ దిస్ మెసేజ్; నో యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్.. అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ట్రయల్స్లో భాగంగా వినియోగదారులు ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా అలర్ట్లు పొందారు. ఈ పరీక్షలు దేశంలో డిజాస్టర్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలనే విస్తృత ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కలిసి సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీపై దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
సాధారణ ఎస్ఎంఎస్తో పోలిస్తే..
సాధారణ ఎస్ఎంఎస్లతో పోలిస్తే, సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని మొబైల్ డివైస్లకు ఒకేసారి సందేశాలను పంపగలదు. భూకంపాలు, సునామీలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఇది తక్షణ సమాచారం అందించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్పై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు బహుభాషల్లో 134 బిలియన్లకు పైగా ఎస్ఎంఎస్ అలర్ట్లు పంపించారు.
ఆందోళన అవసరం లేదు..
సిస్టమ్ను అధికారికంగా ప్రారంభించే ముందు దేశవ్యాప్తంగా పరీక్షలు కొనసాగుతాయి. ఈ దశలో వినియోగదారులు పలుమార్లు ఇలాంటి అలర్ట్లను అందుకునే అవకాశం ఉంటుంది. ఇది వ్యవస్థ పనితీరును పరీక్షించడానికి జరుగుతున్నదని అధికారులు తెలిపారు. సిస్టమ్ పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత, అన్ని మొబైల్ డివైస్లకు అత్యవసర హెచ్చరికలను పంపిస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చే టెస్ట్ మెసేజ్లను నిర్లక్ష్యం చేయాలని, ఎటువంటి చర్య అవసరం లేదని అధికారులు ప్రజలకు సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్లో భారత్దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



