India EV | జూన్లో ఈవీ ద్విచక్ర వాహనాల దూకుడు.. రోజుకు 6 వేలకుపైగా అమ్మకాలు..
India EV | భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈ2డబ్ల్యూ) మార్కెట్ జూన్ లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చులు, మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరిగింది. దీంతో జూన్ నెలలో రోజుకు సగటున 6 వేలకుపైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
Technology | Published On Jul 1, 2026, 4.46 pm IST
India EV | భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈ2డబ్ల్యూ) మార్కెట్ జూన్ లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చులు, మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరిగింది. దీంతో జూన్ నెలలో రోజుకు సగటున 6 వేలకుపైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇది ఇప్పటివరకు నమోదైన రెండో అత్యధిక నెలవారీ అమ్మకాల స్థాయిగా నిలిచింది. వాహన్ డేటా ప్రకారం జూన్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు వార్షిక ప్రాతిపదికన 64 శాతం పెరిగి 1,81,168 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు సుమారు 3,600 మాత్రమే ఉండగా, ఈసారి ఆ సంఖ్య 6 వేల మార్క్ను దాటడం గమనార్హం.
టీవీఎస్ మోటార్స్ అగ్ర స్థానంలో..
మార్కెట్లో టీవీఎస్ మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జూన్ నెలలో కంపెనీ 44,467 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది జూన్లో నమోదైన 26,911 యూనిట్లతో పోలిస్తే 65.2 శాతం వృద్ధి కాగా కంపెనీ మార్కెట్ వాటా గతేడాది 24.7 శాతం ఉంది. ఈసారి స్వల్పంగా తగ్గి 24.5 శాతానికి చేరినా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రెండో స్థానంలో బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీ జూన్లో 40,576 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది ఇదే నెలలో నమోదైన 24,013 యూనిట్లతో పోలిస్తే 69 శాతం అధికం. మార్కెట్ వాటా కూడా 21.5 శాతం నుంచి 22.4 శాతానికి పెరగడంతో అగ్రస్థానంలోని టీవీఎస్కు మరింత దగ్గరైంది. మూడో స్థానంలో ఏథర్ ఎనర్జీఉంది. కంపెనీ 29,422 వాహనాలను విక్రయించగా, ఇది గతేడాది 16,392 యూనిట్లతో పోలిస్తే 79.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ వాటా కూడా 14.7 శాతం నుంచి 16.2 శాతానికి పెరిగిందని వాహన్ డేటా వెల్లడించింది.
వాటాను కోల్పోతున్న ఓలా ఎలక్ట్రిక్..
ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వరుసగా వాటాను కోల్పోతోంది. జూన్ లో కంపెనీ 15,096 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 20,697 యూనిట్లతో పోలిస్తే ఇది 27.1 శాతం తగ్గుదల. మార్కెట్ వాటా కూడా 18.6 శాతం నుంచి కేవలం 8.3 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో ఇది 6 శాతానికి పడిపోయిన తర్వాత, మేలో 8.8 శాతానికి స్వల్పంగా కోలుకుని, జూన్లో 8.3 శాతంగా నమోదైంది. హీరో మోటోకార్ప్ మద్దతుతో ఉన్న విడా కూడా వేగంగా ఎదుగుతోంది. కంపెనీ జూన్లో 20,198 రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 7,945 మాత్రమే. దీంతో మార్కెట్ వాటా 7.1 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగింది. ఇక ఇతర కంపెనీల విభాగంలో మొత్తం 31,381 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించారు. మొత్తం మార్కెట్లో వీటి వాటా 17.3 శాతంగా ఉండటంతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో పోటీ మరింత తీవ్రంగా కొనసాగుతున్నట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad | అధిక వడ్డీ ఆశజూపి.. రూ. 50 కోట్లతో భార్యాభర్తలు పరార్
- ●Satavahana Express | జములాపురం ఉత్సవాలు.. వేళ శాతవాహన ఎక్స్ప్రెస్కు స్పెషల్ హాల్ట్
- ●KTR vs Balmoori Venkat | కేటీఆర్ వన్నీ 'మచ్చర్ పహిల్వాన్' మాటలే.. అయ్య పేరుతో వచ్చిన నీకు సీఎంతో చర్చించే స్థాయి లేదు: బల్మూరి వెంకట్ ఫైర్
- ●CM Revanth Reddy | ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఏఐని వాడండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●POCSO Case Hyderabad | బొమ్మల షాపులో బాలుడిపై అకృత్యం.. 56 ఏళ్ల కీచకుడికి మూడేళ్ల జైలు శిక్ష
- ●Revanth Reddy | అప్పుల సాకుతో తప్పించుకోలేం

Hyderabad | అధిక వడ్డీ ఆశజూపి.. రూ. 50 కోట్లతో భార్యాభర్తలు పరార్

Satavahana Express | జములాపురం ఉత్సవాలు.. వేళ శాతవాహన ఎక్స్ప్రెస్కు స్పెషల్ హాల్ట్

KTR vs Balmoori Venkat | కేటీఆర్ వన్నీ 'మచ్చర్ పహిల్వాన్' మాటలే.. అయ్య పేరుతో వచ్చిన నీకు సీఎంతో చర్చించే స్థాయి లేదు: బల్మూరి వెంకట్ ఫైర్

CM Revanth Reddy | ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఏఐని వాడండి : సీఎం రేవంత్ రెడ్డి






