రెండో టీ20: దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం
క్వింటన్ డీ కాక్ పరుగుల వరద పారించడంతో దక్షిణాఫ్రికా రెండో టీ20లో భారత్పై 51 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 1–1తో సమం చేసింది. మ్యాచ్లోని కీలక ఘట్టాలు, భారత్ బ్యాటింగ్ పతనం — పూర్తి వివరాలు.
De Kock’s 90 Helps South Africa Beat India by 51 Runs; Series Level 1–1
త్రినేత్ర స్పోర్ట్స్ బ్యూరో:
India vs South Africa T20 – న్యూ చండీఘర్లో జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ క్వింటన్ డీకాక్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రతిగా భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్ క్వింటన్ డీ కాక్ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేసాడు. పవర్ప్లే ముగిసేసరికి సౌతీస్ 53/1 వద్ద నిలిచింది. డీ కాక్ కేవలం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా, అదే వేగాన్ని కొనసాగించాడు. మార్క్రమ్ కూడా కొద్ది సేపు దూకుడుగా ఆడడంతో పరుగులు దారాళంగా వచ్చాయి. దానికి తోడు బ్యాటర్ల ధాటికి బౌలర్ల పట్టుతప్పడంతో ఎక్స్ట్రాల రూపంతో 22 పరుగులు ఇచ్చుకోవాల్సివచ్చింది. డీ కాక్ చివరికి 90 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే భారీ స్కోరు దిశగా పయనించిన దక్షిణాఫ్రికా , ఇన్నింగ్స్ ముగిసేసరికి 213/4 స్కోరు నమోదు చేసింది.
ఆదిలోనే గాడితప్పిన భారత చేధన
214 లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది. తొలి బంతికే శుభ్మన్ గిల్ గోల్డెన్ డక్గా వెనుదిరగగా, తర్వాత అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా తొందరగానే ఔటవడంతో భారత్ గొంతుదాకా ఒత్తిడిలో మునిగింది. పవర్ప్లేలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్షర్ కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు కాస్తా 81/4 అయ్యింది. ఈ సమయంలో తిలక్ వర్మ()ధైర్యంగా ఒంటరిపోరాటం కొనసాగించాడు. కానీ, మరోపక్క వికెట్లు పడుతూండటంతో లక్ష్యం కొండలా పెరిగిపోయింది. ఫస్ట్ మ్యాచ్ హీరో హార్థిక్ పాండ్యా() కూడా ఎక్కువసేపు నిలబడలేదు. షాట్లు ఆడాల్సిన తొందరలో వికెట్ సమర్పించుకున్నాడు. జితేష్ శర్మ() కొంత ప్రతిఘటించినా వెంటనే ఔటవడంతో భారత్ పరిస్థితి ఘోరంగా తయారైంది. చివరికి 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఇండియా కథ ముగిసింది. చివరి ఓవర్లలో దక్షిణాఫ్రికా పేసర్ బార్ట్మాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. Yorkerలు, హార్డ్ లెన్త్లతో ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేసి వరుసగా వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సిరీస్ను 1–1తో సమం చేసింది.
కాగా, 5 మ్యాచ్లో సిరీస్లో మూడో టి20 ఆదివారం, డిసెంబర్ 14న ధర్మశాలలో జరుగనుంది.
కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్కెప్టెన్ శుభమన్ గిల్ల వైఫల్యం విజయవంతంగా కొనసాగుతునేఉంది. తొలుత గిల్ స్థానంలో సంజూ సాంసన్ను తీసుకుంటారని వార్తలు వచ్చినా, గిల్ మైదానంలో కనబడటంతో సందిగ్ధం తొలిగిపోయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






