త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | చెన్నైకి మ‌రో ప‌రాజ‌యం.. గుజ‌రాత్ టైటాన్స్ విక్ట‌రీ..!

P

Sports | Published On Apr 26, 2026, 7.34 pm IST

IPL 2026 | చెన్నైకి మ‌రో ప‌రాజ‌యం.. గుజ‌రాత్ టైటాన్స్ విక్ట‌రీ..!
Advertisement

IPL 2026 | చెపాక్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు 16.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా ఛేదించింది. సాయి సుదర్శన్ 87 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరిచి విజయానికి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేస్తూ 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అయితే, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆ త‌ర్వాత గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (33), సాయి సుదర్శన్ కలిసి 58 పరుగుల భాగస్వామ్యం నెల‌కొల్పాడు. ఆ త‌ర్వాత సుదర్శన్ దూకుడు ప్రదర్శనతో చెన్నై బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. జోస్ బట్లర్ (39*) చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదు పరాజయాలతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ అహ్మదాబాద్‌లో ఆర్సీబీతో తలపడనుండగా, చెన్నై ముంబయి ఇండియన్స్‌ను చెపాక్‌లో ఢీకొట్ట‌నుంది.

Advertisement
Advertisement