త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | పాక్ ప్ర‌ధానికి శ్రీ‌లంక అధ్య‌క్షుడు థాంక్స్‌.. ఫోన్‌లో మాట్లాడిన దిస‌నాయ‌కె..

T20 World Cup 2026 | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస‌నాయకె పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణను ఉప‌సంహ‌రించుకోవాల‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఆదేశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

S

Sports | Published On Feb 10, 2026, 10.04 am IST

T20 World Cup 2026 | పాక్ ప్ర‌ధానికి శ్రీ‌లంక అధ్య‌క్షుడు థాంక్స్‌.. ఫోన్‌లో మాట్లాడిన దిస‌నాయ‌కె..
Advertisement

T20 World Cup 2026 | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస‌నాయకె పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణను ఉప‌సంహ‌రించుకోవాల‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఆదేశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ యథావిధిగా జరుగుతుంద‌ని ఐసీసీ, పీసీబీలు వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు చేశాయి. బంగ్లాదేశ్, శ్రీలంకల విజ్ఞప్తుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో టోర్నమెంట్‌పై నెలకొన్న అనిశ్చితి ముగిసింది.

షెహ‌బాజ్‌తో ఫోన్‌లో మాట్లాడిన దిస‌నాయ‌కె..

కొలంబోలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుండటం ఆనందంగా ఉంది.. అని దిస‌నాయకె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు PCBకు లేఖ రాసిన అనంతరం, సోమవారం రాత్రి దిస‌నాయకె స్వయంగా షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడి మ్యాచ్ ఆడేలా ఒప్పించారు. ఈ సంభాషణను పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం కూడా అధికారికంగా ధ్రువీకరించింది. అయితే శ్రీ‌లంక‌తోపాటు పాక్ మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌ల‌కు చెందిన ఐసీసీ స‌భ్యులు కూడా పాక్ క్రికెట్ బోర్డుతో సోమవారం చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోతే అన్ని దేశాల‌కు తీవ్రంగా న‌ష్టం క‌లుగుతుంద‌ని, ప్ర‌పంచానికి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని వారు పాక్ బోర్డుకు చెప్పారు. దీంతో పాకిస్థాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది.

మ‌ళ్లీ హోట‌ల్ బుకింగ్స్ షురూ..

కాగా భార‌త్‌-పాక్ మ్యాచ్ జ‌రుగుతుందో లేదోన‌ని శ్రీ‌లంక ప్ర‌భుత్వం కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మ్యాచ్‌కు మ‌రి కొద్ది రోజులే స‌మ‌యం ఉన్నా హోట‌ల్ బుకింగ్స్ జ‌ర‌గ‌డం లేద‌ని, ఇప్ప‌టికే ఉన్న బుకింగ్స్‌ను కూడా ర‌ద్దు చేసుకున్నారని, ఈ మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోతే తాము తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని శ్రీ‌లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సీ) అంత‌కు ముందు పీసీబీకి లేఖ రాసింది. అయితే బంగ్లాదేశ్ కు న్యాయం చేస్తామ‌ని ఐసీసీ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌డంతోనే పాక్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. ఇక ఈ మ్యాచ్ జ‌రుగుతుంద‌ని నిర్దార‌ణ కావ‌డంతో ఇక శ్రీ‌లంక‌లో మ‌ళ్లీ హోట‌ల్ రూమ్ బుకింగ్స్ ఊపందుకోనున్నాయి. ఈ మ్యాచ్ వ‌ల్ల శ్రీ‌లంకకు కూడా భారీ ఎత్తున ఆదాయం రానుంది.

Advertisement
Advertisement