త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mitchell Santner | భార‌త్ మ‌మ్మ‌ల్ని మించి ఆడింది: కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్

Mitchell Santner | ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ చేతిలో తమ జట్టు పూర్తిగా ఆధిపత్యం చాటలేకపోయిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అంగీకరించాడు. అయితే స్వదేశ ప్రేక్షకుల మద్దతుతో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టును ప్రశంసించాడు.

S

Sports | Published On Mar 9, 2026, 11.55 am IST

Mitchell Santner | భార‌త్ మ‌మ్మ‌ల్ని మించి ఆడింది: కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్
Advertisement

Mitchell Santner | ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ చేతిలో తమ జట్టు పూర్తిగా ఆధిపత్యం చాటలేకపోయిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అంగీకరించాడు. అయితే స్వదేశ ప్రేక్షకుల మద్దతుతో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టును ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడిన శాంట్నర్.. టోర్నమెంట్ మొత్తం తమ జట్టు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ గట్టి పోరాటం చేసిందని చెప్పాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం భారత్ మెరుగైన జట్టుగా నిలిచిందని స్పష్టం చేశాడు. ఈ దశ వరకు రావడం మా ఆటగాళ్లకు గర్వకారణం. మధ్యలో ఎన్నో సవాళ్లు ఎదురైనా ప్రతి దశలో మేం మంచి పోరాటం చేశాం. కానీ ఈ రోజు గొప్ప జట్టైన భారత్ చేతిలో, అద్భుతమైన ప్రేక్షకుల సమక్షంలో మేం ఓడిపోయాం. స్టేడియంలో నీలి రంగు జెర్సీలతో నిండిన సముద్రంలా కనిపించింది. భారత్ స్వదేశ జట్టుగా అభిమానుల పూర్తి మద్దతు పొందింది.. అని మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు.

భారీ ఒత్తిడి ఉన్నా రాణించారు..

స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం ఎంతటి ఒత్తిడిని తెస్తుందో కూడా శాంట్నర్ ప్రస్తావించాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా భారత జట్టు అద్భుతంగా ఆడిందని అభినందించాడు. స్వదేశంలో ప్రపంచకప్ ఆడడం అంటే భారీ ఒత్తిడి ఉంటుంది. కానీ స్కై (సూర్యకుమార్ యాదవ్), భారత ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో గర్వపడేలా ఆడారు. వివిధ దశల్లో వేర్వేరు ఆటగాళ్లు ముందుకు వచ్చి జట్టుకు తోడ్పడ్డారు. సూపర్ 8 దశలో, సెమీఫైనల్లో మేం మంచి పోరాటం చేశాం. అయితే ఈ రాత్రి మాత్రం భారత్ మమ్మల్ని పూర్తిగా మించి ఆడింది.. అని చెప్పాడు.

అరుదైన రికార్డులు సాధించిన టీమిండియా..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టాస్ గెలిచి భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సంజూ శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేసి 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదగా, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేసి 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేసి 4 ఫోర్లు, 4 సిక్సర్లు సాధించాడు. శివం దూబే 8 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ తరఫున టిమ్ సైఫర్ట్ 26 బంతుల్లో 52 పరుగులు చేసి 2 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. అయినప్పటికీ అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయ‌గా, జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లను ప‌డ‌గొట్టి కివీస్ బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. దీంతో మెన్ ఇన్ బ్లూ అద్భుత విజయంతో తమ మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అలాగే టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన‌ తొలి జట్టుగా నిలిచింది. అదేవిధంగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి ఆతిథ్య దేశంగా కూడా భారత్ చరిత్ర సృష్టించింది.

Advertisement
Advertisement