త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women’s T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం.. పాక్‌ను చిత్తు చేసిన భార‌త్‌

Women’s T20 World Cup | ఫార్మాట్ ఏదైనా, పురుషుల జ‌ట్ట‌యినా, మ‌హిళ‌ల టీమ్ అయినా.. దాయాది పాకిస్థాన్‌పై (Pakistan) భార‌త్‌ది (India ) తిరుగులేని ఆధిప‌త్య‌మే. మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో (Women’s T20 World Cup) టీమ్ ఇండియా శుభారంభం చేసింది.

G

Sports | Published On Jun 15, 2026, 6.02 am IST

Women’s T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం.. పాక్‌ను చిత్తు చేసిన భార‌త్‌
Advertisement

Women’s T20 World Cup | త్రినేత్ర‌.న్యూస్‌: ఫార్మాట్ ఏదైనా, పురుషుల జ‌ట్ట‌యినా, మ‌హిళ‌ల టీమ్ అయినా.. దాయాది పాకిస్థాన్‌పై (Pakistan) భార‌త్‌ది (India ) తిరుగులేని ఆధిప‌త్య‌మే. మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో (Women’s T20 World Cup) టీమ్ ఇండియా శుభారంభం చేసింది. బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్యర్ధితో జ‌రిగిన మ్యాచ్‌లో 64 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. స్మృతి మంధాన (Smriti Mandhana) బ్యాట్‌తో చెల‌రేగ‌డం, దీప్తీ శ‌ర్మ బాల్‌ను (Deepti Sharma) తిప్పేయ‌డంతో పాక్‌పై సునాయాసంగా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ మంధాన (68), రిచా ఘోష్ (34) మెరుపుల‌తో 6 వికెట్ల‌కు 170 ర‌న్స్ చేసింది. అనంత‌రం 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 16.6 ఓవర్లలో 106 పరుగులకే కుప్ప‌కూలింది. మునీబా అలీ (41) మాత్ర‌మే రాణించగా, మిగ‌తా బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌య్యారు. దీప్తికి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ల‌భించింది.

చెల‌రేగిన స్మృతి మంధాన

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ స్మృతి మంధాన గట్టి పునాది వేసింది. షఫాలీ వర్మ (6), జెమిమా రోడ్రిగ్స్ (1) త్వరగానే ఔట్ పెవీలియ‌న్ చేరిన‌ప్ప‌టికీ.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36 పరుగులు)తో క‌లిసి జ‌ట్టును ఆదుకుంది. ఆమె కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసింది. చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది.

దీప్తి మ్యాజిక్.. కుప్పకూలిన పాక్

ల‌క్ష్య ఛేద‌నలో పాకిస్తాన్‌కు ఓపెనర్లు మునీబా అలీ (41), గుల్ ఫెరోజా (12) మంచి ఆరంభ‌మే ఇచ్చారు. ప‌వ‌ర్‌ప్లే ముగిసే స‌మ‌యానికి ఒక్క వికెట్ కూడా న‌ష్ట‌పోకుండా 39/0 ప‌రుగుల‌తో పటిష్టంగా కనిపించింది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ త‌న బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. 5 పరుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు (5/5) పడగొట్టి పాక్ ఓట‌మిని లిఖించింది. ఆమెకు టీ20 క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. దీప్తి దెబ్బ‌కు పాక్‌ 16.6 ఓవర్లలోనే 106 పరుగులకు ఆలౌట్ అయింది.

Advertisement
Advertisement