Chinnaswamy Stadium | చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే.. మృతులకు ఆర్సీబీ నివాళులు..
Chinnaswamy Stadium | ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ గత సీజన్ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులను స్మరించుకునేందుకు ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే అన్ని దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్లలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నట్లు ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్ తెలిపారు.
Chinnaswamy Stadium | ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ గత సీజన్ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులను స్మరించుకునేందుకు ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే అన్ని దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్లలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నట్లు ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్ తెలిపారు. అంతేకాకుండా ఈ సీజన్ మొత్తం ప్రాక్టీస్ మ్యాచ్లలో ఆటగాళ్లు జెర్సీ నంబర్ 11 ధరించనున్నారు. అలాగే ఈ సీజన్లో జరిగే అన్ని మ్యాచ్లలో నల్లని ఆర్మ్బ్యాండ్లు ధరించి మృతులకు నివాళులు అర్పించనున్నారు..
11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచుతాం..
జూన్ 4న తాము కోల్పోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో జెర్సీ నంబర్ 11 ధరిస్తారు. మ్యాచ్ రోజు, మ్యాచ్కు ముందు జరిగే ప్రాక్టీస్లో కూడా ప్రతి ఆటగాడి జెర్సీ వెనుక 11 నంబర్ ఉంటుంది. అయితే మ్యాచ్లో మాత్రం కాదు, ప్రాక్టీస్ సమయంలో మాత్రమే.. అని మీనన్ తెలిపారు. అదే విధంగా మ్యాచ్ రోజు ప్లేయర్లు నల్లని ఆర్మ్బ్యాండ్లు కూడా ధరిస్తారు. చిన్నస్వామి స్టేడియంలో శాశ్వతంగా 11 సీట్లను ఖాళీగా ఉంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఈ 11 మంది అభిమానులు ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఈ ఏడాది మేం తీసుకుంటున్న చర్యలపై ఇది ఒక తక్షణ అప్డేట్.. అని మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన పేర్కొన్నారు.
భద్రతా చర్యలను అమలు చేస్తాం..
ఈ సీజన్లో జాగ్రత్త చర్యలలో భాగంగా అనేక మార్పులు చేపట్టామని, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేస్తున్నామని మీనన్ తెలిపారు. భవిష్యత్తులో బాధిత కుటుంబాలకు మరింత సహాయం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. గత సంవత్సరం జూన్ 4, 2025న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. సుమారు 3 లక్షల మంది గుమిగూడడంతో తీవ్ర రద్దీ ఏర్పడి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
ఈ సీజన్లో 5 మ్యాచ్లు..
ఆ ఘటనకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోకపోవడం, గందరగోళ పరిస్థితులకు కారణమవడం వల్ల ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ భాగస్వాములపై కర్ణాటక ప్రభుత్వం బాధ్యతను మోపింది. అనంతరం మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ఈ దుర్ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఎలాంటి మ్యాచ్లు నిర్వహించలేదు. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో ఆర్సీబీ 5 మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండగా, మరో 2 హోం మ్యాచ్లను రాయ్పూర్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్కు నో..!
మే 19, 2026

Hardik Pandya | గర్ల్ఫ్రెండ్తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



