Thalasani Srinivas Yadav | కేసీఆర్ అంటే కాంగ్రెస్కు భయమెందుకు: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Thalasani Srinivas Yadav | కేసీఆర్ (KCR) అంటే కాంగ్రెస్ (Congress)కు అంత భయమెందుకని.. కేసీఆర్ జగిత్యాల సభ రోజే రైతు బంధు నిధులు విడుదల చేయడం, మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఎందుకు? అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) ప్రశ్నించారు. జగిత్యాల (Jagtial) సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళుతూ మార్గమధ్యలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆయన కాసేపు ఆగారు.
Thalasani Srinivas Yadav: త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ (KCR) అంటే కాంగ్రెస్ (Congress)కు అంత భయమెందుకని.. కేసీఆర్ జగిత్యాల సభ రోజే రైతు బంధు నిధులు విడుదల చేయడం, మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఎందుకు? అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. జగిత్యాల (Jagtial) సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళుతూ మార్గమధ్యలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆయన కాసేపు ఆగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

జగిత్యాలలో రేపటి కేసీఆర్ సభ ఘనంగా జరుగుతుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని, ప్రజల్లోకి రావడం లేదని పదేపదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని.. మరి ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తుంటే ఎందుకు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదన్నారు. రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి 10 వేలు చొప్పున రైతుబంధు సాయం అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
మీరు అప్పు చేసి ప్రజలకు ఏం చేశారు?
ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ లు కేసీఆర్ ప్రభుత్వం అందించింది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకొని కేసీఆర్ ప్రభుత్వం పని చేసింది. కేసీఆర్ అప్పులు చేశారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో 3.50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వంటి రిజర్వాయర్లను నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం. జిల్లాకు ఒక కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక హామీల అమలును మరిచింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చారా? మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం ఇస్తామన్నారు.. ఏమైంది? అని తలసాని ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



