త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్ వ‌ల్లే..కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ప‌రిమితం: చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్‌ (KTR) లాగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పారాచ్యూట్ లీడ‌ర్ కాద‌ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఎద్దేవా చేశారు. రేవంత్ కు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ (Godfather) ఎవరూ లేరని చెప్పారు.

A

News | Published On Dec 21, 2025, 1.42 pm IST

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్ వ‌ల్లే..కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ప‌రిమితం: చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి
Advertisement

Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌ (KTR) లాగా ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పారాచ్యూట్ లీడ‌ర్ కాద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ (Godfather) ఎవరూ లేరని చెప్పారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్‌గా జెడ్పిటిసీగా గెలిచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. కేటీఆర్ లాగా అమెరికా నుంచి పారాచ్యూట్ లో సిరిసిల్లకు రాలేదని పేర్కొన్నారు. కేసీఆర్ పిలిచారని వచ్చి సిరిసిల్లలో ఉన్న నాయకులను కాదని కేటీఆర్ పోటీ చేసి వంద ఓట్లతో గెలిచారని చెప్పారు.

ఇప్ప‌టికే కేటీఆర్‌తో రేవంత్ రాజ‌కీయాల్లో ఫుట్‌బాల్ ఆడుతున్నార‌ని ఎద్దేవా

కేటీఆర్ మెస్సిలా భావించి రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ ఆడాలని తహతహలాడుతున్నారని చామ‌ల అన్నారు. కేటీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడరని, ఆయ‌న‌ను ఆల్ రెడీ రాజకీయాల్లో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని చెప్పారు. కేటీఆర్‌ ఆడాల్సిన రాజకీయం ఆడటంలేదని, ఇంకా ఫుట్ బాల్ ఏం ఆడతారని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ తో కేటీఆర్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయింద‌న్నారు.

కేటీఆర్‌ది ఐర‌న్ లెగ్‌...

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శిఖరాగ్రం చేరుకున్నానని తన గురించి కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ది ఐరెన్ లెగ్ అని ఆయ‌న‌ బావ, చెల్లె బయట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ పుణ్యం వలనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమ‌య్యారని, రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకుండా అయ్యారని వ్యాఖ్యానించారు. ఆయ‌న పుణ్యం వ‌ల్ల‌నే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ గుండు సున్నా సాధించిందని, కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోయింద‌ని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ రాజ‌కీయ‌ భవిష్యత్ ఖతం అయిందని అన్నారు. కేటీఆర్‌, హ‌రీశ్‌లు రోజుకో ప్రెస్ మీట్ ప‌డితే ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్లే ప్రతి రూపాయిని రేవంత్ రెడ్డి వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఢిల్లీ టూర్ లకు వెళ్తున్నారని వివ‌రించారు. తెలంగాణలో బిఆర్ఎస్ మనుగడ కోల్పోయిందని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణకు సంబంధం లేకుండా అయిందని చెప్పారు. కేటీఆర్ ప్రాక్టికల్ గా ఆలోచించాలని హిత‌వు ప‌లికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement