త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists surrender | నేడు సోది కేశాలు స‌హా 30 మంది మావోల లొంగుబాటు!

Maoists surrender | మావోయిస్టుల లొంగుబాటు (Maoists surrender) చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. నేడు లొంగిపోయే వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్‌ సభ్యులు, బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు సహా 30 మంది నక్సల్స్‌ ఉన్నారు.

S

News | Published On Apr 10, 2026, 11.48 am IST

Maoists surrender | నేడు సోది కేశాలు స‌హా 30 మంది మావోల లొంగుబాటు!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మావోయిస్టుల లొంగుబాటు (Maoists surrender) చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇటీవ‌లే మావో ముఖ్య ముఖ్య నేత‌లు దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు గ‌త ఫిబ్రవరి 24న తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా నేడు మ‌రో 30 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్లు స‌మాచారం.

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్​ రెడ్డి వెల్లడించనున్న‌ట్లు తెలిసింది. లొంగిపోయే వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్‌ సభ్యులు, బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు సహా 30 మంది నక్సల్స్‌ ఉన్నారు. ఇప్ప‌టికే సుమారు 40 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులకు సరెండర్ చేశారు. వాటిలో ఏకే 47 సహా అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో రోజురోజుకు కూంబింగ్ పెంచుతుండ‌డంతో ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌ మావోలు తెలంగాణ పోలీసులను ఆశ్ర‌యించిన‌ట్లు విశ్వ‌నీయ వర్గాల ద్వారా తెలిసింది.

 

Advertisement
Advertisement