KTR | నేటికీ ఒక్క జొన్న గింజ కొనలే: కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
KTR | రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో జొన్న (Sorghum) పంట వేస్తే.. ఇప్పటివరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న (Maize) పంట పండిస్తే.. కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నుల పంటనే కొంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని మండిపడ్డారు.
- 4 లక్షల ఎకరాల్లో జొన్న పంట పండింది
- 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది
- 9,500 కొనుగోలు కేంద్రాలకు 6 వేలే తెరిచారు
- ధాన్యం కొనక నిన్న ఒక్కరోజే ఇద్దరు రైతులు చనిపోయారు
- అవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే
- రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం
KTR | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో జొన్న (Sorghum) పంట వేస్తే.. ఇప్పటివరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న (Maize) పంట పండిస్తే.. కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నుల పంటనే కొంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని మండిపడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందని..
పంటను కొనుగోలు చేస్తే మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందని అన్ని పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి (Paddy) కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క వరి కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణమే పంటలను కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం అని ఆయన విమర్శించారు.
రంగారెడ్డిలో గౌరయ్య, మహబూబాబాద్లో వెంకయ్య చనిపోయారు..
రుణమాఫీ కాక, కరెంటు సరిగా లేక, రైతుబంధు ఇవ్వకపోయినా కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ధాన్యం కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోంది. నిన్న ఒక్కరోజే రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య, మహబూబాబాద్లో వెంకయ్య అనే ఇద్దరు రైతులు చనిపోయారు. ఇవి కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే కేవలం 6 వేలు మాత్రమే తెరిచారు. సంగారెడ్డి జిల్లాలో మాత్రం వరి కొనుగులు కేంద్రం ఒక్కటి కూడా పెట్టలేదు. ఆ సంస్థకు బ్యాంకులో లోన్ కూడా ఇవ్వరు. అందుకే ఇవాళ కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి లేదు. పాత పద్ధతిలోనే వడ్లు, శనగలు, జొన్నలు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



