త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshwar Reddy | రాష్ట్ర ఖ‌జానాలో పైసా లేదట‌.. 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ సాధ్య‌మా?

తెలంగాణ రాష్ట్ర ఖజానాలో పైసా లేదని.. ఈ ప‌రిస్థితుల్లో బ్యాంకులు (Banks) నమ్మి అప్పు ఇచ్చే పరిస్థితి అంత‌క‌న్నా లేద‌ని రాష్ట్ర బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి (BJP Legislative party Leader Maheshwar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట‌ల్లో ఉన్న ప‌స చేత‌ల్లో లేద‌ని విమ‌ర్శించారు.

S

News | Published On Mar 20, 2026, 12.23 pm IST

Maheshwar Reddy | రాష్ట్ర ఖ‌జానాలో పైసా లేదట‌.. 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ సాధ్య‌మా?
Advertisement

- బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర ఖజానాలో పైసా లేదని.. ఈ ప‌రిస్థితుల్లో బ్యాంకులు (Banks) నమ్మి అప్పు ఇచ్చే పరిస్థితి అంత‌క‌న్నా లేద‌ని రాష్ట్ర బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి (BJP Legislative party Leader Maheshwar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట‌ల్లో ఉన్న ప‌స చేత‌ల్లో లేద‌ని విమ‌ర్శించారు. అప్పు లేనిదే రోజు గడవని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం మాటలు మాత్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (3 Trillion dollar economy) గురించి మాట్లాడుతుండ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కనీసం 14-15% వృద్ధి రేటు లేకుండా సాధ్యం కాని కలను ఎలా నిజం చేస్తుందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. నన్ను కోస్తే పైసా లేద‌ని చెప్పే సీఎం రేవంత్ ఈ రాష్ట్రాన్ని ఎలా న‌డిపిస్తారో అర్థం కావ‌డం లేద‌ని పేర్కొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement