త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | కేర‌ళం విజయం తెలంగాణ‌కు మ‌రింత బ‌లాన్నిచ్చింది: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | కేరళం (Keralam)లో కాంగ్రెస్‌ విజయం తెలంగాణ (Telangana) లో పార్టీకి మరింత బలాన్ని, మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగించిందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూడీఎఫ్ (UDF) ఘన విజయాన్ని సాధించడం పట్ల ఆయ‌న హర్షం వ్యక్తం చేశారు.

S

News | Published On May 4, 2026, 5.58 pm IST

Mahesh Kumar Goud | కేర‌ళం విజయం తెలంగాణ‌కు మ‌రింత బ‌లాన్నిచ్చింది: మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: కేరళం (Keralam)లో కాంగ్రెస్‌ విజయం తెలంగాణ (Telangana) లో పార్టీకి మరింత బలాన్ని, మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగించిందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూడీఎఫ్ (UDF)  కూట‌మి ఘన విజయాన్ని సాధించడం పట్ల ఆయ‌న హర్షం వ్యక్తం చేశారు. కేరళంలో 140 సీట్లలో దాదాపు 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకోవ‌డం చరిత్రాత్మకమ‌న్నారు.

విజ‌య్‌కు అభినంద‌న‌లు..

కేరళంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు నాయకులు ప్రచారం నిర్వహించడం.. తెలంగాణలో పాలన చూసి ఓట్లు వేయాలని కోరడం చాలా ప్రభావం చూపించింది. తమిళనాడులో ప్రజలు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని గెలిపించడం శుభ‌సూచ‌కం. విజ‌య్‌కు అభినందనలు.

బెంగాల్‌లో బీజేపీ కుట్ర‌..

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మొదటి నుంచి ఒక కుట్ర పూరిత రాజకీయాలు చేసింది. స‌ర్ పేరుతో టీఎంసీ అనుకూల ఓట్లను తొలగించడం, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేయడం లాంటి చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం. దుర్మార్గపు రాజకీయాలతో అధికారంలోకి వచ్చేలా కుట్రలు చేశారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను సమీక్ష చేసి ఇండియా కూటమి మరింత బలోపేతం అయ్యేందుకు, అంతా కలిసి బీజేపీ కుట్ర రాజకీయాలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు చేయాలి అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.

Advertisement
Advertisement