త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | భ‌గీర‌థ్ కేసుపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ మొద‌లెట్టండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth Reddy | కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమారుడు బండి భ‌గీర‌థ్‌ (Bandi Bhagirath) పై న‌మోదైన పోక్సో కేసుపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ మొదలు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ (DGP Anand) ను ఆదేశించారు. కేసు సగ్రమ విచారణ కోసం ప్రత్యేక బృందాల‌ను ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు.

S

News | Published On May 11, 2026, 1.17 pm IST

CM Revanth Reddy | భ‌గీర‌థ్ కేసుపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ మొద‌లెట్టండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశం
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమారుడు బండి భ‌గీర‌థ్‌ (Bandi Bhagirath) పై న‌మోదైన పోక్సో కేసుపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ మొదలు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ (DGP Anand) ను ఆదేశించారు. కేసు సగ్రమ విచారణ కోసం ప్రత్యేక బృందాల‌ను ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రశ్నించారు.

కాగా ఈ కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో ఉన్నార‌ని చెప్పారు. కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా డీజీపీ సీఎంకు వివరించారు.

Advertisement
Advertisement