త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఓట్ చోర్..గ‌ద్దీ ఛోడ్‌: మోదీకి రాహుల్ సూచ‌న‌

Special Intensive Revision (SIR- ప్ర‌త్యేక ఓటర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌) పేరుతో ఎన్డీఏ ప్ర‌భుత్వం ..ప్ర‌తిప‌క్షాల‌కు మ‌ద్ద‌తునిచ్చే ఓట‌ర్ల‌నే జాబితాల నుంచి తొల‌గిస్తున్న‌ద‌ని లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వ‌జ‌మెత్తారు.

a

News | Published On Dec 14, 2025, 7.26 pm IST

ఓట్ చోర్..గ‌ద్దీ ఛోడ్‌: మోదీకి రాహుల్ సూచ‌న‌
Advertisement

ఓట్ చోర్..గ‌ద్దీ ఛోడ్‌: మోదీకి రాహుల్ సూచ‌న‌
త్రినేత్ర.న్యూస్‌: Special Intensive Revision (SIR- ప్ర‌త్యేక ఓటర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌) పేరుతో ఎన్డీఏ ప్ర‌భుత్వం ..ప్ర‌తిప‌క్షాల‌కు మ‌ద్ద‌తునిచ్చే ఓట‌ర్ల‌నే జాబితాల నుంచి తొల‌గిస్తున్న‌ద‌ని లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వ‌జ‌మెత్తారు. SIR పేరుతో జ‌రుగుతున్న ఓట్ చోరీ జ‌రుగుతున్న‌దంటూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం (2025 డిసెంబ‌ర్ 14) ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఓట్ చోర్ గ‌ద్దీ చోడ్ నినాదంతో భారీ ర్యాలీ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప్రియాంక గాంధీ, జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీలు జైరామ్ ర‌మేశ్‌, కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ ముఖ్య‌మంత్రి భూపేశ్ బ‌ఘేల్ త‌దితరులు పాల్గొన్నారు.

ఎన్నిక‌ల సంఘం బీజేపీ తొత్తు
ర్యాలీలో లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ.. బీజేపీ పార్టీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అధికార బ‌లంతో మోదీ SIR పేరుతో ఎన్డీఏకు ల‌బ్ధి చేకూరేలా ఓట్లు తొల‌గిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల సంఘం..బీజేపీపార్టీకి తొత్తులా మారింద‌ని విమ‌ర్శించారు. SIRలో అక్ర‌మాల‌కు తెర‌లేపిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఇదిలాగే కొన‌సాగితే ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదం లో ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. దేశ‌వ్యాప్తంగా SIRకు వ్య‌తిరేకంగా 5 కోట్ల‌కు పైగా సంత‌కాలు సేక‌రించామ‌ని రాహుల్ చెప్పారు. ఓట్ చోర్ గ‌ద్దీ ఛోడ్ అని ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు  SIRకు వ్య‌తిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి అంద‌రూ క‌లిసి రావాల‌ని ఆయ‌న కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement