త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC Chief Mahesh Kumar Goud | బీజేపీపై ఎక్కు పెట్టిన అస్త్రమే సేవాద‌ళ్: టీపీసీసీ చీఫ్‌ మ‌హేశ్‌కుమార్ గౌడ్

TPCC Chief Mahesh Kumar Goud | దేశ స్వతంత్ర పోరాటం నుంచే సేవాద‌ళ్ (Seva Dal) క్రియాశీల‌క కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తోందని, సెంట్ర‌ల్ బాడీలో ఉంటూ బీజేపీ (BJP) అవ‌లంబిస్తున్న ధోర‌ణుల‌ను ఎప్ప‌టికప్పుడు ఎండ‌గ‌డుతోంద‌ని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సేవాదళ్ జాతీయ అధ్యక్షుడి లాల్‌జీ దేశాయ్ (Lalji Desai)తో క‌లిసి మంగ‌ళ‌వారం సమర్థ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.

S

News | Published On Apr 28, 2026, 3.40 pm IST

TPCC Chief Mahesh Kumar Goud | బీజేపీపై ఎక్కు పెట్టిన అస్త్రమే సేవాద‌ళ్: టీపీసీసీ చీఫ్‌ మ‌హేశ్‌కుమార్ గౌడ్
Advertisement
  • నేటి నుంచి మే 2 వ‌ర‌కు స‌మ‌ర్థ శిక్ష‌ణ శిబిరం కొన‌సాగుతుంది
  • బీఆర్ఎస్‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు
  • ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది
  • సేవాద‌ళ్ కార్య‌క్ర‌మ ప్రారంభంలో మ‌హేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్య‌లు

TPCC Chief Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ స్వతంత్ర పోరాటం నుంచే సేవాద‌ళ్ (Seva Dal) క్రియాశీల‌క కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తోందని, సెంట్ర‌ల్ బాడీలో ఉంటూ బీజేపీ (BJP) అవ‌లంబిస్తున్న ధోర‌ణుల‌ను ఎప్ప‌టికప్పుడు ఎండ‌గ‌డుతోంద‌ని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించే సమర్థ్ శిక్షణ శిబిరాన్ని ఆయ‌న సేవాదళ్ జాతీయ అధ్యక్షుడి లాల్‌జీ దేశాయ్ (Lalji Desai)తో క‌లిసి మంగ‌ళ‌వారం ప్రారంభించారు. నేటి నుంచి మే 2 వరకు ఆరు రోజుల పాటు సేవాదళ్ కార్యక్రమాలు కొన‌సాగుతాయ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మ‌హేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. సేవాదళ్ కార్యక్రమాలు సెంట్రల్ బాడీలో ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అవలంబిస్తున్న ధోరణిని ఎండగడుతుంది. దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా మోదీ ప్రభుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేస్తోంది అని మ‌హేశ్‌కుమార్ గైడ్ ఆరోపించారు.

క‌విత ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ స‌మాధానం చెప్పాలి..

పదేండ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. కవిత ప్రశ్నలకు సమాధానం క‌చ్చితంగా చెప్పాల్సిన‌ పరిస్థితి ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లు ప‌దేండ్లు ఆదరించిన బీఆర్ఎస్ ను ఇప్పుడు ప‌ట్టించుకునే పరిస్థితి క‌నిపిస్తలేదు. కుటుంబం వివాదాల‌తో కేసీఆర్ సతమతం అవుతున్నారు. ప్రజల గురించి పట్టించుకోకుండా పదవుల గురించి పాకులాడుతున్నారు. బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నిర్మాణం క్రెడిట్ అంతా సోనియాగాంధీకి దక్కుతుంది. కేసీఆర్ తెలంగాణను పాలించి 50 ఏండ్లు వెనక్కి నెట్టారు అని బీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

 

Advertisement
Advertisement