త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హించిన సీఎం రేవంత్‌ను అభినందించిన‌ ఎంపీలు

Telangana Rising | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ (Global Summit)ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంతో పాటు రాష్ట్రంలో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం (CM) ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఎంపీలు అభినందించారు.

A

News | Published On Dec 11, 2025, 1.15 pm IST

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హించిన సీఎం రేవంత్‌ను అభినందించిన‌ ఎంపీలు
Advertisement

Telangana Rising | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ (Global Summit)ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డంతో పాటు రాష్ట్రానికి రూ.5.75 ల‌క్ష‌ల‌ కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు వివిధ సంస్థ‌లు ముందుకొచ్చిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి (CM) ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు అభినందించారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పార్ల‌మెంట్‌కు వ‌చ్చిన ఆయ‌న‌ను ఎంపీలు పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, సురేష్ షెట్కార్‌, డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్ ఆయ‌న‌కు పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి అభినందించారు. ఈ పెట్టుబ‌డుల‌తో రాష్ట్రంలోని యువ‌త‌కు విస్తృత ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌డంతో పాటు రాష్ట్రం అభివృద్ధిలో అగ్ర‌గామిగా నిలుస్తుంద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి వెంట మంత్రి వివేక్ వెంకట స్వామి ఉన్నారు.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement