త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Kotta Prabhakar Reddy | మైకును నేల‌కేసి కొట్టిన‌ ఎమ్మెల్యే.. ప్ర‌జాపాల‌న కార్య‌క్ర‌మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌

MLA Kotta Prabhakar Reddy | సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజ‌క‌వ‌ర్గంలో శ‌నివారం ఏర్పాటు చేసిన ప్ర‌జాపాల‌న (Praja Palana) కార్య‌క్ర‌మం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి మైకును నేల‌కేసి కొట్ట‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

S

News | Published On May 2, 2026, 2.25 pm IST

MLA Kotta Prabhakar Reddy | మైకును నేల‌కేసి కొట్టిన‌ ఎమ్మెల్యే.. ప్ర‌జాపాల‌న కార్య‌క్ర‌మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌
Advertisement

MLA Kotta Prabhakar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజ‌క‌వ‌ర్గంలో శ‌నివారం ఏర్పాటు చేసిన ప్ర‌జాపాల‌న (Praja Palana) కార్య‌క్ర‌మం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి మైకును నేల‌కేసి కొట్ట‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

దుబ్బాక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్ల‌డుతుండ‌గా అధికారులు మైకు క‌నెక్ష‌న్‌ను తొల‌గించారు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన ప్ర‌భాక‌ర్‌రెడ్డి రెండు మైకుల‌ను నేల‌కేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వెంట‌నే వ‌డ్లు కొనాలి..

అనంత‌రం ఎమ్మెల్యేతో స‌హా బీఆర్ఎస్ శ్రేణులంతా నిర‌స‌న‌కు దిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. వ‌ద్దురా నాయ‌నా.. ఈ కాంగిరేసు పాల‌న, సీఎం డౌన్‌.. డౌన్ అంటూ నిన‌దించారు. ఈ సంద‌ర్భంగా కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట్ల‌డుతూ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. వెంట‌నే ధాన్యం కొనుగోలు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని నిలదీశారు. వడ్ల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని నేలపై కూర్చొని నిరసనకు దిగారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement