త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించేలా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి, మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. విద్యార్థులకు వారి తల్లిదంత్రులతో ఉన్న బంధాన్ని రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకుంటుంద‌ని చెప్పారు.

G

News | Published On Feb 4, 2026, 12.45 pm IST

Ponnam Prabhakar | రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించేలా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి, మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. విద్యార్థులకు వారి తల్లిదంత్రులతో ఉన్న బంధాన్ని రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకుంటుంద‌ని చెప్పారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞా వెబ్సైట్‌ను (Road Safety Pledge) ర‌వాణా శాఖ‌ ప్రారంభించిందని వెల్ల‌డించారు. స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్‌లో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌ను (Prathigna Website) మంత్రి ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ.. ఈ ప్రతిజ్ఞ రాబోయే కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి కారణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతి విద్యార్థి త‌మ తల్లిదండ్రుల వ‌ద్ద‌ అగ్రిమెంట్ ద్వారా విద్యార్థులతో ఉన్న వారి బాండింగ్‌తో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆకాక్షించారు. ఇది ఆన్‌లైన్‌లో, క్షేత్ర స్థాయిలో ప్రతి మోటార్ వెహికిల్ ఉన్న వారి దగ్గరకు పెద్ద ఉద్య‌మంగా రవాణా శాఖ అధికారులు తీసుకుపోవాల‌ని సూచించారు.


ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌

తెలంగాణలో బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన సంస్కృతిని నిర్మించే దిశగా రోడ్డు భ‌ద్ర‌తా ప్ర‌తిజ్ఞ వెబ్‌సైట్ ఒక‌ ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. పౌరులు, తల్లిదండ్రులను రోడ్డు భద్రతకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడం, ప్రాణాలను రక్షించడం ఉమ్మడి బాధ్యత అని, సురక్షితమైన అలవాట్లు ఇంట్లోనే ప్రారంభమై ప్రతి రహదారిపై కొనసాగుతాయని గుర్తించడం రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు వినియోగదారుల్లో క్రమశిక్షణ, అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించే దార్శనికతను ఇది పునరుద్ఘాటిస్తుంది. పౌరులు ట్రాఫిక్ నియమాలను పాటించడానికి, రోడ్డుపై ఉన్న ప్రతి జీవితాన్ని గౌరవించడానికి పౌర ప్రతిజ్ఞను తీసుకోవచ్చు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌వాణా శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రాష్ట్ర రవాణా అథారిటీ సభ్యుడు నవీన్ పెట్టెం పాల్గొన్నారు.

Advertisement
Advertisement