త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రైతుల బాధ‌లు వింటూ.. భ‌రోసా ఇస్తూ

KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంగ‌ళ‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలించి రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోళ్ల‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తుందంటూ మండిప‌డ్డారు.

S

News | Published On May 5, 2026, 5.54 pm IST

KTR | రైతుల బాధ‌లు వింటూ.. భ‌రోసా ఇస్తూ
Advertisement
  • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో కేటీఆర్ విస్తృత ప‌ర్య‌ట‌న
  • కేటీఆర్ ముందు స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టిన అన్న‌దాత‌లు

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంగ‌ళ‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలించి రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోళ్ల‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తుందంటూ మండిప‌డ్డారు. ఎంపీ వద్దిరాజు ర‌విచంద్ర‌, ఎమ్మెల్యే పల్లా తదితర ప్రముఖులతో కలిసి కొనుగోలు కేంద్రాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రైతులు కేటీఆర్‌కు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు.

జ‌న‌గామ‌లో ఐకేపీ కేంద్రం ప‌రిశీల‌న..

ఎంపీ వద్దిరాజు ర‌విచంద్ర‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి తదితర ప్రముఖు బీఆర్ఎస్ నాయ‌కుల‌తో కలిసి జనగామ (Jangaon) మండలం యశ్వంతాపూర్ వద్ద ఉన్న ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తాము 15 రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రాత్రింబవళ్లు ఇక్కడ కాలం గడుపుతున్నామని, కష్టాలు కడతేర్చాలంటూ కేటీఆర్ ముందు ఏకరువు పెట్టారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులు ఉన్నారు. అంత‌కుముందు జనగామలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించి తేనీరు స్వీకరించారు.

Advertisement
Advertisement