త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఎమ్మెల్యేలు దానం, క‌డియంకు స్పీక‌ర్‌ క్లీన్‌చిట్‌.. ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి: కేటీఆర్‌

KTR | పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరికి (Kadiyam Srihari) స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జ‌రిగిన‌ బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు.

G

News | Published On Mar 11, 2026, 11.32 am IST

KTR | ఎమ్మెల్యేలు దానం, క‌డియంకు స్పీక‌ర్‌ క్లీన్‌చిట్‌.. ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరికి (Kadiyam Srihari) స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జ‌రిగిన‌ బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని చెప్పారు.

ఇది కేవలం ఒక తీర్పు కాదని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణగా అభివ‌ర్ణించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే.. ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్ర‌శ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నార‌ని, సరైన సమయంలో సమాధానం చెబుతారన్నారు.

Advertisement
Advertisement