POCSO Case Judgment | కామాంధుడిని 20 ఏండ్లు జైల్లో ఉంచండి.. పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు
POCSO Case Judgment | బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు షాద్నగర్ అరుణ్ (Arun) అలియాస్ నాని (23)కి 20 ఏళ్ల జైలు శిక్ష (Punishment) విధిస్తూ రాజేంద్రనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (Rangareddy fast track court) తీర్పునిచ్చింది. రూ.8,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ. 3,00,000 పరిహారం అందించాలని ఆదేశించింది.
POCSO Case Judgment | త్రినేత్ర.న్యూస్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలనాత్మక రేప్, పోక్సో కేసులో (Cr.No. 193/2019) రాజేంద్రనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (Rangareddy fast track court) మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు షాద్నగర్ అరుణ్ (Arun) అలియాస్ నాని (23)కి 20 ఏళ్ల జైలు శిక్ష (Punishment) విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అత్తాపూర్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు వివరాల ప్రకారం.. 2019, ఫిబ్రవరి 12న నిందితుడు అరుణ్ 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యాదగిరిగుట్ట ఆలయానికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై IPC సెక్షన్లు 366, 376(2)(i)(l), పోక్సో చట్టం సెక్షన్ 5(I) R/w 6 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.8,000 జరిమానా విధించారని చెప్పారు. బాధితురాలికి రూ. 3,00,000 పరిహారం అందించాలని కోర్టు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారి కె.అశోక్ చక్రవర్తి (ఏసీపీ రాజేంద్రనగర్, రిటైర్డ్) సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, స్పెషల్ పీపీ బి.వెంకటేశ్వర్ రెడ్డి వాదనలతో నిందితుడికి శిక్ష పడటం ఖరారైంది. ఇన్ స్పెక్టర్ కె. నాగేశ్వరరావు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎం.రవీందర్ (PC 4336), సమ్మన్స్ పీసీ ఎం.మధుకర్ (PC 10319), ఎస్సై కుమారి పి.పార్వతి ఈ కేసును తార్కిక ముగింపునకు తీసుకురావడంలో కృషి చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



